కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మొదటిసమావేశానికి తెలంగాణా గైర్హాజరైంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్టుల సంయుక్త సమావేశం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. సంయుక్త బోర్డుల మొదటిసమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవ్వాలని ముందే సమాచారం ఇచ్చినా తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరుకాకపోవటం విచిత్రంగా ఉంది.
సమావేశానికి హాజరైన ఏపి ఉన్నతాధికారులు మాత్రం కొన్ని విషయాల్లో తమ వాదనను వినిపించారు. మరికొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత అన్నీ వివరాలను సమావేశం ముందుచుతామని స్పష్టంచేశారు. బోర్డుల సంయుక్త సమావేశంలో కొంపలు ముణిగిపోయే నిర్ణయాలు ఏమీ ఉండవని అందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తు కేంద్రం ఇటీవలే గెజెట్ ను జారీచేసిన విషయం తెలిసిందే.
ఈ గెజెట్ లో కొన్ని తప్పులున్నాయని, కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలున్నాయని ఏపి కేంద్రానికి లేఖరాసింది. అలాగే సుప్రింకోర్టులో కేసు కూడా వేసింది. ఇదే సమయంలో తెలంగాణా ప్రభుత్వం కూడా గెజెట్ విషయంలో తన వ్యతిరేకతను వ్యక్తంచేసింది. రెండు ప్రభుత్వాల స్పందనను చూసిన తర్వాతే మరింత సమాచారం కోసం కేంద్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సమావేశంలో పాల్గొనే తమ అభ్యంతరాలను ఏమిటో చెప్పాల్సిన తెలంగాణా ప్రభుత్వం మరెందుకు గైర్హాజరయ్యిందో అర్దం కావటంలేదు. సమావేశం ఏ విజయవాడలోనో, విశాఖపట్నంలోనో జరగలేదు. పోనీ ఢిల్లీలో జరిగింది కాబట్టి వెళ్ళటానికి కుదరలేదని అనుకున్నా అర్ధముంది. సమావేశం జరిగింది సాక్ష్యాత్తు హైదరాబాద్ లోనే. ముఖ్యమంత్రితో సహా మంత్రి, ఉన్నతాధికారులు, సలహాదారులందరు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయినా సమావేశానికి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదంటే అర్ధమేంటి ?
ప్రాజెక్టుల విషయంలో ఏపి దాదాగిరి చేస్తోందని ఈమధ్యనే కేసీయార్ వ్యాఖ్యానించారు. ఏపి దాదాగిరి చేస్తున్నదే నిజమైతే మరి సమావేనికి హాజరై అదే విషయాన్ని తెలంగాణా ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? దాదాగిరి చేస్తున్నదెవరో బయటపడతుందననేనా ? బోర్డుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సొస్తుందనే తెలంగాణా ఉన్నతాధికారులు హాజరుకాలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తానికి మొదటిసమావేశానికి గైర్హాజరవ్వటం ద్వారా తెలంగాణా కేంద్రానికి ఎలాంటి సంకేతాలు పంపింది ? కోర్టులోనే తేల్చుకుంటాం కానీ రాజీపడం అని చెప్పాలనుకుంటుందా ? మరి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ టోన్ ఏమైనా మారే అవకాశం ఉందా?
This post was last modified on August 5, 2021 9:54 am
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…