Political News

చర్చ- తెలంగాణా ఎందుకు గైర్హాజరైంది ?

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మొదటిసమావేశానికి తెలంగాణా గైర్హాజరైంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్టుల సంయుక్త సమావేశం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. సంయుక్త బోర్డుల మొదటిసమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవ్వాలని ముందే సమాచారం ఇచ్చినా తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరుకాకపోవటం విచిత్రంగా ఉంది.

సమావేశానికి హాజరైన ఏపి ఉన్నతాధికారులు మాత్రం కొన్ని విషయాల్లో తమ వాదనను వినిపించారు. మరికొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత అన్నీ వివరాలను సమావేశం ముందుచుతామని స్పష్టంచేశారు. బోర్డుల సంయుక్త సమావేశంలో కొంపలు ముణిగిపోయే నిర్ణయాలు ఏమీ ఉండవని అందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తు కేంద్రం ఇటీవలే గెజెట్ ను జారీచేసిన విషయం తెలిసిందే.

ఈ గెజెట్ లో కొన్ని తప్పులున్నాయని, కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలున్నాయని ఏపి కేంద్రానికి లేఖరాసింది. అలాగే సుప్రింకోర్టులో కేసు కూడా వేసింది. ఇదే సమయంలో తెలంగాణా ప్రభుత్వం కూడా గెజెట్ విషయంలో తన వ్యతిరేకతను వ్యక్తంచేసింది. రెండు ప్రభుత్వాల స్పందనను చూసిన తర్వాతే మరింత సమాచారం కోసం కేంద్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

సమావేశంలో పాల్గొనే తమ అభ్యంతరాలను ఏమిటో చెప్పాల్సిన తెలంగాణా ప్రభుత్వం మరెందుకు గైర్హాజరయ్యిందో అర్దం కావటంలేదు. సమావేశం ఏ విజయవాడలోనో, విశాఖపట్నంలోనో జరగలేదు. పోనీ ఢిల్లీలో జరిగింది కాబట్టి వెళ్ళటానికి కుదరలేదని అనుకున్నా అర్ధముంది. సమావేశం జరిగింది సాక్ష్యాత్తు హైదరాబాద్ లోనే. ముఖ్యమంత్రితో సహా మంత్రి, ఉన్నతాధికారులు, సలహాదారులందరు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయినా సమావేశానికి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదంటే అర్ధమేంటి ?

ప్రాజెక్టుల విషయంలో ఏపి దాదాగిరి చేస్తోందని ఈమధ్యనే కేసీయార్ వ్యాఖ్యానించారు. ఏపి దాదాగిరి చేస్తున్నదే నిజమైతే మరి సమావేనికి హాజరై అదే విషయాన్ని తెలంగాణా ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? దాదాగిరి చేస్తున్నదెవరో బయటపడతుందననేనా ? బోర్డుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సొస్తుందనే తెలంగాణా ఉన్నతాధికారులు హాజరుకాలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తానికి మొదటిసమావేశానికి గైర్హాజరవ్వటం ద్వారా తెలంగాణా కేంద్రానికి ఎలాంటి సంకేతాలు పంపింది ? కోర్టులోనే తేల్చుకుంటాం కానీ రాజీపడం అని చెప్పాలనుకుంటుందా ? మరి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ టోన్ ఏమైనా మారే అవకాశం ఉందా?

This post was last modified on August 5, 2021 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

5 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

6 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

7 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

7 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

9 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

9 hours ago