Political News

చర్చ- తెలంగాణా ఎందుకు గైర్హాజరైంది ?

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మొదటిసమావేశానికి తెలంగాణా గైర్హాజరైంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్టుల సంయుక్త సమావేశం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. సంయుక్త బోర్డుల మొదటిసమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవ్వాలని ముందే సమాచారం ఇచ్చినా తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరుకాకపోవటం విచిత్రంగా ఉంది.

సమావేశానికి హాజరైన ఏపి ఉన్నతాధికారులు మాత్రం కొన్ని విషయాల్లో తమ వాదనను వినిపించారు. మరికొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత అన్నీ వివరాలను సమావేశం ముందుచుతామని స్పష్టంచేశారు. బోర్డుల సంయుక్త సమావేశంలో కొంపలు ముణిగిపోయే నిర్ణయాలు ఏమీ ఉండవని అందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తు కేంద్రం ఇటీవలే గెజెట్ ను జారీచేసిన విషయం తెలిసిందే.

ఈ గెజెట్ లో కొన్ని తప్పులున్నాయని, కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలున్నాయని ఏపి కేంద్రానికి లేఖరాసింది. అలాగే సుప్రింకోర్టులో కేసు కూడా వేసింది. ఇదే సమయంలో తెలంగాణా ప్రభుత్వం కూడా గెజెట్ విషయంలో తన వ్యతిరేకతను వ్యక్తంచేసింది. రెండు ప్రభుత్వాల స్పందనను చూసిన తర్వాతే మరింత సమాచారం కోసం కేంద్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

సమావేశంలో పాల్గొనే తమ అభ్యంతరాలను ఏమిటో చెప్పాల్సిన తెలంగాణా ప్రభుత్వం మరెందుకు గైర్హాజరయ్యిందో అర్దం కావటంలేదు. సమావేశం ఏ విజయవాడలోనో, విశాఖపట్నంలోనో జరగలేదు. పోనీ ఢిల్లీలో జరిగింది కాబట్టి వెళ్ళటానికి కుదరలేదని అనుకున్నా అర్ధముంది. సమావేశం జరిగింది సాక్ష్యాత్తు హైదరాబాద్ లోనే. ముఖ్యమంత్రితో సహా మంత్రి, ఉన్నతాధికారులు, సలహాదారులందరు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయినా సమావేశానికి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదంటే అర్ధమేంటి ?

ప్రాజెక్టుల విషయంలో ఏపి దాదాగిరి చేస్తోందని ఈమధ్యనే కేసీయార్ వ్యాఖ్యానించారు. ఏపి దాదాగిరి చేస్తున్నదే నిజమైతే మరి సమావేనికి హాజరై అదే విషయాన్ని తెలంగాణా ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? దాదాగిరి చేస్తున్నదెవరో బయటపడతుందననేనా ? బోర్డుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సొస్తుందనే తెలంగాణా ఉన్నతాధికారులు హాజరుకాలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తానికి మొదటిసమావేశానికి గైర్హాజరవ్వటం ద్వారా తెలంగాణా కేంద్రానికి ఎలాంటి సంకేతాలు పంపింది ? కోర్టులోనే తేల్చుకుంటాం కానీ రాజీపడం అని చెప్పాలనుకుంటుందా ? మరి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ టోన్ ఏమైనా మారే అవకాశం ఉందా?

Satya

Recent Posts

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

8 minutes ago

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

3 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

4 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

5 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

7 hours ago

ఆలూ లేదు చూలూ లేదు… చిరు, నానికి లింకు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…

9 hours ago