Political News

చంద్ర‌బాబు అడుగు పెట్ట‌గానే కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌ల‌వ‌గానే ఆయ‌న హైద‌రాబాద్‌కు వెళ్లిపోయి అక్క‌డే త‌న సొంతింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. వైర‌స్ వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో తాను ఏపీకి వెళ్లి జ‌నాల్ని క‌ల‌వ‌డం వాళ్ల‌కు, త‌న‌కు మంచిది కాద‌ని ఆయ‌న భావించి ఉండొచ్చు. అందుకే అధికార ప‌క్షం నుంచి ఎంత‌గా క‌వ్వింపులు వ‌చ్చినా ఆయ‌న హైద‌రాబాద్ వీడ‌లేదు. ఇప్పుడు లాక్ డౌన్ స‌డ‌లింపులు రావ‌డంతో బాబు ఏపీకి బ‌య‌ల్దేరారు. ముందు విమానంలో వెళ్లాల‌నుకున్నారు. అందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో త‌న కాన్వాయ్‌లోనే సోమ‌వారం విజ‌య‌వాడ‌కు వెళ్లారు చంద్ర‌బాబు.

ఐతే బాబు రెండు నెల‌ల విరామం త‌ర్వాత ఏపీకి రావ‌డంతో ఆయ‌న అభిమానులు, తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున పోగై బాబుకు స్వాగ‌తం ప‌లికారు. దీంతో బాబు అండ్ లాక్ డౌన్ నిబంధ‌నలు ఉల్లంఘించిన‌ట్ల‌యింది. సంబంధిత ఫొటోలు, వీడియోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. బాబుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు కోర్టు వ‌ర‌కు వెళ్లింది. అనంత‌పురానికి చెందిన గోపాల్ రెడ్డి అనే లాయ‌ర్.. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని హైకోర్టులో రిట్ పిటిష‌న్ వేశారు. బాబు చేసిన ప‌ని త‌ప్పుడు సంకేతాలు ఇస్తుంద‌ని.. వేరే రాజ‌కీయ పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా ఇలాగే గుమిగూడితో ప‌రిస్థితి ఏంట‌ని పిటిష‌న్ దారు ప్ర‌శ్నించారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on May 26, 2020 1:28 am

Share
Show comments
Published by
suman

Recent Posts

సిద్ధు మీద నిర్మాతకు కంప్లైంట్.. తీరా చూస్తే

యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ‌కు యూత్‌లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్‌ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ…

2 hours ago

బిజినెస్‌‌మేన్ చూసి బుక్ చించేసిన రాజమౌళి

మహేష్ బాబు కెరీర్లో పవర్ ఫుల్ హిట్లలో ‘బిజినెస్‌మేన్’ ఒకటి. ‘పోకిరి’ తర్వాత పూరితో మహేష్ చేసిన ఈ సినిమాకు…

2 hours ago

ఆసుపత్రి పాలైన అలేఖ్య చిట్టి

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…

2 hours ago

జగన్ నోట మళ్లీ అదే మాట… పోలీసులపై వైసీపీ అధినేత ఫైరింగ్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా…

2 hours ago

తిలక్ రిటైర్డ్ ఔట్ పై క్లారిటీ ఇచ్చేసిన హార్దిక్

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 12 పరుగుల…

3 hours ago

పవన్ కొడుకు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి.. బాబు, లోకేశ్ ల స్పందన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…

3 hours ago