ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎట్టకేలకు మళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టారు. కరోనా వైరస్ ప్రభావం మొదలవగానే ఆయన హైదరాబాద్కు వెళ్లిపోయి అక్కడే తన సొంతింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో తాను ఏపీకి వెళ్లి జనాల్ని కలవడం వాళ్లకు, తనకు మంచిది కాదని ఆయన భావించి ఉండొచ్చు. అందుకే అధికార పక్షం నుంచి ఎంతగా కవ్వింపులు వచ్చినా ఆయన హైదరాబాద్ వీడలేదు. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు రావడంతో బాబు ఏపీకి బయల్దేరారు. ముందు విమానంలో వెళ్లాలనుకున్నారు. అందుకు అవకాశం లేకపోవడంతో తన కాన్వాయ్లోనే సోమవారం విజయవాడకు వెళ్లారు చంద్రబాబు.
ఐతే బాబు రెండు నెలల విరామం తర్వాత ఏపీకి రావడంతో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున పోగై బాబుకు స్వాగతం పలికారు. దీంతో బాబు అండ్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లయింది. సంబంధిత ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాబుపై విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది. అనంతపురానికి చెందిన గోపాల్ రెడ్డి అనే లాయర్.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై చర్యలు చేపట్టాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. బాబు చేసిన పని తప్పుడు సంకేతాలు ఇస్తుందని.. వేరే రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఇలాగే గుమిగూడితో పరిస్థితి ఏంటని పిటిషన్ దారు ప్రశ్నించారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on May 26, 2020 1:28 am
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…