ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎట్టకేలకు మళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టారు. కరోనా వైరస్ ప్రభావం మొదలవగానే ఆయన హైదరాబాద్కు వెళ్లిపోయి అక్కడే తన సొంతింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో తాను ఏపీకి వెళ్లి జనాల్ని కలవడం వాళ్లకు, తనకు మంచిది కాదని ఆయన భావించి ఉండొచ్చు. అందుకే అధికార పక్షం నుంచి ఎంతగా కవ్వింపులు వచ్చినా ఆయన హైదరాబాద్ వీడలేదు. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు రావడంతో బాబు ఏపీకి బయల్దేరారు. ముందు విమానంలో వెళ్లాలనుకున్నారు. అందుకు అవకాశం లేకపోవడంతో తన కాన్వాయ్లోనే సోమవారం విజయవాడకు వెళ్లారు చంద్రబాబు.
ఐతే బాబు రెండు నెలల విరామం తర్వాత ఏపీకి రావడంతో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున పోగై బాబుకు స్వాగతం పలికారు. దీంతో బాబు అండ్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లయింది. సంబంధిత ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాబుపై విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది. అనంతపురానికి చెందిన గోపాల్ రెడ్డి అనే లాయర్.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై చర్యలు చేపట్టాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. బాబు చేసిన పని తప్పుడు సంకేతాలు ఇస్తుందని.. వేరే రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఇలాగే గుమిగూడితో పరిస్థితి ఏంటని పిటిషన్ దారు ప్రశ్నించారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…