ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎట్టకేలకు మళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టారు. కరోనా వైరస్ ప్రభావం మొదలవగానే ఆయన హైదరాబాద్కు వెళ్లిపోయి అక్కడే తన సొంతింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో తాను ఏపీకి వెళ్లి జనాల్ని కలవడం వాళ్లకు, తనకు మంచిది కాదని ఆయన భావించి ఉండొచ్చు. అందుకే అధికార పక్షం నుంచి ఎంతగా కవ్వింపులు వచ్చినా ఆయన హైదరాబాద్ వీడలేదు. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు రావడంతో బాబు ఏపీకి బయల్దేరారు. ముందు విమానంలో వెళ్లాలనుకున్నారు. అందుకు అవకాశం లేకపోవడంతో తన కాన్వాయ్లోనే సోమవారం విజయవాడకు వెళ్లారు చంద్రబాబు.
ఐతే బాబు రెండు నెలల విరామం తర్వాత ఏపీకి రావడంతో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున పోగై బాబుకు స్వాగతం పలికారు. దీంతో బాబు అండ్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లయింది. సంబంధిత ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాబుపై విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది. అనంతపురానికి చెందిన గోపాల్ రెడ్డి అనే లాయర్.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై చర్యలు చేపట్టాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. బాబు చేసిన పని తప్పుడు సంకేతాలు ఇస్తుందని.. వేరే రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఇలాగే గుమిగూడితో పరిస్థితి ఏంటని పిటిషన్ దారు ప్రశ్నించారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on May 26, 2020 1:28 am
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…