Political News

టీటీడీ భూముల అమ్మ‌కంపై యుట‌ర్న్?

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌రుడికి భ‌క్తులు ఇచ్చిన భూముల్ని అమ్మేందుకు రంగం సిద్ధం చేయడంపై తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త‌, విమ‌ర్శ‌లు రావడంతో టీటీడీ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంది. భూముల అమ్మ‌కాల ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలిపి వేసింది. భూముల అమ్మ‌కాల‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదంటూ బోర్డు ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. టీటీడీ భూముల అమ్మ‌కాల‌పై జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

టీటీడీ భూముల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, వేలానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని.. ఈ లోపే కొందరు కావాల‌నే రాద్ధాంతం చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. టీటీడీ భూములు అమ్మాలంటే కేవలం రూ.కోటీ 53 లక్షల విలువైన భూములే అమ్మాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తదుపరి బోర్డు సమావేశంలో భూముల విక్రయంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అయ‌న‌న్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న భూముల ప‌రిర‌క్ష‌ణ క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతోనే వాటిని అమ్మాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని సుబ్బారెడ్డి చెప్పారు.

అధికార బృందాన్ని పంపించి మార్కెట్‌ విలువ, అక్కడి పరిస్థితుల గురించి రోడ్డు మ్యాప్‌ తయారు చేయాలని మాత్రమే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామ‌ని.. వేలం వేయాలని ఎక్కడా ఉత్తర్వులు ఇవ్వలేదని సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.

అన్యాక్రాంతమైన భూములు, నిరుపయోగంగా ఉన్న ఆస్తుల్నే అమ్మాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని.. అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన చదలవాడ కృష్ణమూర్తి తితిదే ఛైర్మన్‌గా ఉన్నప్పుడే భూములు విక్రయించాలని తీర్మానం చేసిన‌ట్లు సుబ్బారెడ్డి గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో సదావర్తి భూముల అమ్మకానికి పెడితే కోర్టుకెళ్లి అడ్డుకున్నది తామే అని.. టీటీడీకి భూముల విష‌యంలో ఉద్దేశం వేర‌ని సుబ్బారెడ్డి అన్నారు.

This post was last modified on May 25, 2020 9:18 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago