అవును కేసీయార్ ఎంతో ప్రిస్టేజిగా తీసుకున్న దళితబంధు పథకం ఇపుడు తలనొప్పులు తెస్తున్నట్లే ఉంది. దళితులను ఆకర్షించేందుకు కేసీయార్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు కూడా చెప్పారు. ఉపఎన్నికలు జరగబోతున్న కారణంగా హుజూరాబాద్ ను కేసీయార్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని అందరికీ అర్ధమైపోయింది.
అయితే ఎవరు ఊహించని విధంగా రెండువైపుల నుండి సమస్యలు మొదలయ్యాయి. అదేమిటంటే మొదటిదేమో దళిత సంఘాల నుండి మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 100 కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం దళితులందరికీ పైలెట్ ప్రాజెక్టును వర్తింపచేయాలంటు దళితసంఘాలు డిమాండ్లు మొదలుపెట్టాయి. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం మాత్రమే కాదని రాష్ట్రం మొత్తానికి ఒకేసారి పథకాన్ని అమల్లోకి తేవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
ఇక రెండో సమస్య ఏమిటంటే దళితులకు దళితబంధు పథకం పెట్టినట్లుగానే బీసీలకు కూడా ఓ బంధును అమల్లోకి తేవాలంటు కమ్మరి, కుమ్మరి, యాదవ, గౌడ్, నాయీబ్రాహ్మణ లాంటి బీసీల్లోని ఉపకులాలన్నీ డిమాండ్లు మొదలుపెట్టాయి. ఎస్సీలతో పోల్చుకుంటే బీసీల్లోని ఉపకులాల్లోను ఆర్ధికంగా వెనకబడిన లక్షలాది కుటుంబాలున్నట్లు వాళ్ళు చెబుతున్నారు. దళితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నట్లే తమను మాత్రం ఎందుకు ఆదుకోరంటు కేసీయార్ ను నిలదీస్తున్నారు.
ఇటు దళితులు, అటు బీసీల నుండి పెరిగిపోతున్న డిమాండ్లు చూస్తుంటే చివరకు కొత్త పథకమే కేసీయార్ ను ఉపఎన్నికలో ముంచేస్తుందా అనే డౌటనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే హుజూరాబాద్ లో ఎస్సీల ఓట్లు 45 వేలైతే బీసీల ఓట్లు సమారు లక్షదాకా ఉన్నాయి. ఈ బీసీల ఓట్లను నమ్ముకునే ఈటల రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఈటల కూడా బీసీయే కాబట్టి. బీసీల్లో ఈటలకు మంచి పట్టుందన్న విషయం తెలుసుకాబట్టే కేసీయార్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే అనవసరంగా దళితబంధు పథకాన్ని ప్రకటించారా అనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on August 1, 2021 6:34 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…