అవును కేసీయార్ ఎంతో ప్రిస్టేజిగా తీసుకున్న దళితబంధు పథకం ఇపుడు తలనొప్పులు తెస్తున్నట్లే ఉంది. దళితులను ఆకర్షించేందుకు కేసీయార్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు కూడా చెప్పారు. ఉపఎన్నికలు జరగబోతున్న కారణంగా హుజూరాబాద్ ను కేసీయార్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని అందరికీ అర్ధమైపోయింది.
అయితే ఎవరు ఊహించని విధంగా రెండువైపుల నుండి సమస్యలు మొదలయ్యాయి. అదేమిటంటే మొదటిదేమో దళిత సంఘాల నుండి మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 100 కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం దళితులందరికీ పైలెట్ ప్రాజెక్టును వర్తింపచేయాలంటు దళితసంఘాలు డిమాండ్లు మొదలుపెట్టాయి. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం మాత్రమే కాదని రాష్ట్రం మొత్తానికి ఒకేసారి పథకాన్ని అమల్లోకి తేవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
ఇక రెండో సమస్య ఏమిటంటే దళితులకు దళితబంధు పథకం పెట్టినట్లుగానే బీసీలకు కూడా ఓ బంధును అమల్లోకి తేవాలంటు కమ్మరి, కుమ్మరి, యాదవ, గౌడ్, నాయీబ్రాహ్మణ లాంటి బీసీల్లోని ఉపకులాలన్నీ డిమాండ్లు మొదలుపెట్టాయి. ఎస్సీలతో పోల్చుకుంటే బీసీల్లోని ఉపకులాల్లోను ఆర్ధికంగా వెనకబడిన లక్షలాది కుటుంబాలున్నట్లు వాళ్ళు చెబుతున్నారు. దళితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నట్లే తమను మాత్రం ఎందుకు ఆదుకోరంటు కేసీయార్ ను నిలదీస్తున్నారు.
ఇటు దళితులు, అటు బీసీల నుండి పెరిగిపోతున్న డిమాండ్లు చూస్తుంటే చివరకు కొత్త పథకమే కేసీయార్ ను ఉపఎన్నికలో ముంచేస్తుందా అనే డౌటనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే హుజూరాబాద్ లో ఎస్సీల ఓట్లు 45 వేలైతే బీసీల ఓట్లు సమారు లక్షదాకా ఉన్నాయి. ఈ బీసీల ఓట్లను నమ్ముకునే ఈటల రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఈటల కూడా బీసీయే కాబట్టి. బీసీల్లో ఈటలకు మంచి పట్టుందన్న విషయం తెలుసుకాబట్టే కేసీయార్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే అనవసరంగా దళితబంధు పథకాన్ని ప్రకటించారా అనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…