Political News

హైద‌రాబాద్ ఆస్ప‌త్రికి ఈట‌ల‌… ఆ ఆస్ప‌త్రిలో చేర‌లేదు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ త‌న ప్రజా దీవెన యాత్రతో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ ను పెంచిన సంగ‌తి తెలిసిందే. అయితే, 12వ రోజు పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక దగ్గర ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ప్రత్యేక బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. అనంత‌రం ఆయ‌న్ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అయితే, హైద‌రాబాద్ లో ఆయ‌న చేరిన ఆస్ప‌త్రి గురించి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

పాద‌యాత్ర‌లో ఈటల కాళ్లకు పొక్కులు రావడం, తీవ్ర అలసట, గొంతు బొంగురు వంటి సమస్యలతో బాధపడుతుండ‌గా ఆయ‌న‌కు చికిత్స అందించారు. అనంత‌రం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఈటలకు బీపీ, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, షుగర్‌ లెవల్స్‌ పెరిగినట్లు గుర్తించారు. అనంత‌రం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్య పరీక్షల తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

స‌హ‌జంగా తెలంగాణ‌కు చెందిన నేత‌లు అస్వ‌స్థ‌త‌కు గురైన‌ప్పుడు య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారని సోష‌ల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే, ఆ ఆస్ప‌త్రికి అధికార పార్టీతో సంబంధాలున్నాయ‌నే ఉద్దేశంతో ఈట‌లను అపోలో ఆస్ప‌త్రిలో చేర్పించార‌ని అంటున్నారు. పైగా, అపోలో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌నే సంగ‌తి తెలిసిందే. ఈట‌ల‌తో కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఈ కోణంలోనే ఆయ‌న్ను అపోలోలో చేర్పించార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on August 1, 2021 5:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

13 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

43 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago