Political News

హైద‌రాబాద్ ఆస్ప‌త్రికి ఈట‌ల‌… ఆ ఆస్ప‌త్రిలో చేర‌లేదు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ త‌న ప్రజా దీవెన యాత్రతో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ ను పెంచిన సంగ‌తి తెలిసిందే. అయితే, 12వ రోజు పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక దగ్గర ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ప్రత్యేక బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. అనంత‌రం ఆయ‌న్ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అయితే, హైద‌రాబాద్ లో ఆయ‌న చేరిన ఆస్ప‌త్రి గురించి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

పాద‌యాత్ర‌లో ఈటల కాళ్లకు పొక్కులు రావడం, తీవ్ర అలసట, గొంతు బొంగురు వంటి సమస్యలతో బాధపడుతుండ‌గా ఆయ‌న‌కు చికిత్స అందించారు. అనంత‌రం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఈటలకు బీపీ, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, షుగర్‌ లెవల్స్‌ పెరిగినట్లు గుర్తించారు. అనంత‌రం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్య పరీక్షల తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

స‌హ‌జంగా తెలంగాణ‌కు చెందిన నేత‌లు అస్వ‌స్థ‌త‌కు గురైన‌ప్పుడు య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారని సోష‌ల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే, ఆ ఆస్ప‌త్రికి అధికార పార్టీతో సంబంధాలున్నాయ‌నే ఉద్దేశంతో ఈట‌లను అపోలో ఆస్ప‌త్రిలో చేర్పించార‌ని అంటున్నారు. పైగా, అపోలో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌నే సంగ‌తి తెలిసిందే. ఈట‌ల‌తో కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఈ కోణంలోనే ఆయ‌న్ను అపోలోలో చేర్పించార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Satya

Recent Posts

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

24 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

7 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

8 hours ago