Political News

జగన్ కు కేంద్రం షాకిచ్చేలా ఉందే…

పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన ఓ జవాబు విన్న తర్వాత జగన్ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ఓ ప్రశ్నకు కంద్రమంత్రి కిరణ్ రిరిజు సమాధానమిస్తు ఏపిలో శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. మండలిలో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నయాన్న కారణంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయించిన విషయం అందరికీ తెలిసిందే.

అసెంబ్లీలో వైసీపీకి బంపర్ మెజారిటి ఉన్నట్లే శాసనమండలిలో టీడీపీకి మంచి మెజారిటి ఉండేది. ఈ కారణంతోనే అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లులు మండలిలో వీగిపోయేవి. మండలిలో తనకు బలం ఉందన్న ఏకైక కారణంతో ప్రభుత్వం పంపిన ప్రతిబిల్లుకు టీడీపీ అడ్డంపడేది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీ అడ్డుకోవటంతో అప్పట్లో బాగా గొడవలయ్యాయి. జరిగిన గొడవలతో విసిగిపోయిన జగన్ అసలు మండలినే రద్దు చేయించాలని అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. కరోనా వైరస్ కారణంగా పార్లమెంటు సమావేశాలు పెద్దగా జరగలేదు. జరిగిన సమావేశాల్లో కూడా మండలి తీర్మానం అంశం చర్చకు రాలేదు. మారిన పరిణామాల్లో మండలిలో మొన్నటి జూన్ తో వైసీపీకి ఇక్కడ కూడా మెజారిటి వచ్చేసింది. దాంతో రెండు సభల్లోను ఎదురులేకపోవటంతో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది.

ఎప్పుడైతే మండలిలో కూడా వైసీపీకి మెజారిటి వచ్చేసిందో అప్పటి నుండి మండలి రద్దుకు జగన్ కట్టబడుండాలని టీడీపీ నేతలు పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రంలో ఏ దశలో ఉందో ఎవరు పట్టించుకోలేదు. అయితే టీడీపీ ఎంపి ప్రశ్నకు మంత్రి సమాధానంతో వైసీపీ ఎంఎల్సీల్లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంటే మళ్ళీ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలి.

మండలిలో మెజారిటి వచ్చేసిందన్న ఉద్దేశ్యంతో రద్దు తీర్మానంపై అధికారపార్టీ పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. ఇపుడు గనుక కేంద్రం మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే జగన్ కు చాలా ఇబ్బందనే చెప్పాలి. మంత్రి ప్రకటన ప్రకారం మండలి రద్దు అంశంపై రాష్ట్రప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదన్న విషయం అర్ధమైపోతోంది. తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు తెలీవు కానీ అసెంబ్లీ తీర్మానాన్ని పంపకపోతే మాత్రం జగన్ కు కేంద్రం షాకిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on July 30, 2021 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా విలియమ్స్ 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

5 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

40 minutes ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

2 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago