Political News

జగన్ కు కేంద్రం షాకిచ్చేలా ఉందే…

పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన ఓ జవాబు విన్న తర్వాత జగన్ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ఓ ప్రశ్నకు కంద్రమంత్రి కిరణ్ రిరిజు సమాధానమిస్తు ఏపిలో శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. మండలిలో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నయాన్న కారణంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయించిన విషయం అందరికీ తెలిసిందే.

అసెంబ్లీలో వైసీపీకి బంపర్ మెజారిటి ఉన్నట్లే శాసనమండలిలో టీడీపీకి మంచి మెజారిటి ఉండేది. ఈ కారణంతోనే అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లులు మండలిలో వీగిపోయేవి. మండలిలో తనకు బలం ఉందన్న ఏకైక కారణంతో ప్రభుత్వం పంపిన ప్రతిబిల్లుకు టీడీపీ అడ్డంపడేది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీ అడ్డుకోవటంతో అప్పట్లో బాగా గొడవలయ్యాయి. జరిగిన గొడవలతో విసిగిపోయిన జగన్ అసలు మండలినే రద్దు చేయించాలని అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. కరోనా వైరస్ కారణంగా పార్లమెంటు సమావేశాలు పెద్దగా జరగలేదు. జరిగిన సమావేశాల్లో కూడా మండలి తీర్మానం అంశం చర్చకు రాలేదు. మారిన పరిణామాల్లో మండలిలో మొన్నటి జూన్ తో వైసీపీకి ఇక్కడ కూడా మెజారిటి వచ్చేసింది. దాంతో రెండు సభల్లోను ఎదురులేకపోవటంతో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది.

ఎప్పుడైతే మండలిలో కూడా వైసీపీకి మెజారిటి వచ్చేసిందో అప్పటి నుండి మండలి రద్దుకు జగన్ కట్టబడుండాలని టీడీపీ నేతలు పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రంలో ఏ దశలో ఉందో ఎవరు పట్టించుకోలేదు. అయితే టీడీపీ ఎంపి ప్రశ్నకు మంత్రి సమాధానంతో వైసీపీ ఎంఎల్సీల్లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంటే మళ్ళీ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలి.

మండలిలో మెజారిటి వచ్చేసిందన్న ఉద్దేశ్యంతో రద్దు తీర్మానంపై అధికారపార్టీ పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. ఇపుడు గనుక కేంద్రం మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే జగన్ కు చాలా ఇబ్బందనే చెప్పాలి. మంత్రి ప్రకటన ప్రకారం మండలి రద్దు అంశంపై రాష్ట్రప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదన్న విషయం అర్ధమైపోతోంది. తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు తెలీవు కానీ అసెంబ్లీ తీర్మానాన్ని పంపకపోతే మాత్రం జగన్ కు కేంద్రం షాకిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on July 30, 2021 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

1 hour ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

3 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

6 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

6 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

7 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

9 hours ago