పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన ఓ జవాబు విన్న తర్వాత జగన్ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ఓ ప్రశ్నకు కంద్రమంత్రి కిరణ్ రిరిజు సమాధానమిస్తు ఏపిలో శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. మండలిలో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నయాన్న కారణంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయించిన విషయం అందరికీ తెలిసిందే.
అసెంబ్లీలో వైసీపీకి బంపర్ మెజారిటి ఉన్నట్లే శాసనమండలిలో టీడీపీకి మంచి మెజారిటి ఉండేది. ఈ కారణంతోనే అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లులు మండలిలో వీగిపోయేవి. మండలిలో తనకు బలం ఉందన్న ఏకైక కారణంతో ప్రభుత్వం పంపిన ప్రతిబిల్లుకు టీడీపీ అడ్డంపడేది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీ అడ్డుకోవటంతో అప్పట్లో బాగా గొడవలయ్యాయి. జరిగిన గొడవలతో విసిగిపోయిన జగన్ అసలు మండలినే రద్దు చేయించాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. కరోనా వైరస్ కారణంగా పార్లమెంటు సమావేశాలు పెద్దగా జరగలేదు. జరిగిన సమావేశాల్లో కూడా మండలి తీర్మానం అంశం చర్చకు రాలేదు. మారిన పరిణామాల్లో మండలిలో మొన్నటి జూన్ తో వైసీపీకి ఇక్కడ కూడా మెజారిటి వచ్చేసింది. దాంతో రెండు సభల్లోను ఎదురులేకపోవటంతో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది.
ఎప్పుడైతే మండలిలో కూడా వైసీపీకి మెజారిటి వచ్చేసిందో అప్పటి నుండి మండలి రద్దుకు జగన్ కట్టబడుండాలని టీడీపీ నేతలు పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రంలో ఏ దశలో ఉందో ఎవరు పట్టించుకోలేదు. అయితే టీడీపీ ఎంపి ప్రశ్నకు మంత్రి సమాధానంతో వైసీపీ ఎంఎల్సీల్లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంటే మళ్ళీ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలి.
మండలిలో మెజారిటి వచ్చేసిందన్న ఉద్దేశ్యంతో రద్దు తీర్మానంపై అధికారపార్టీ పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. ఇపుడు గనుక కేంద్రం మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే జగన్ కు చాలా ఇబ్బందనే చెప్పాలి. మంత్రి ప్రకటన ప్రకారం మండలి రద్దు అంశంపై రాష్ట్రప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదన్న విషయం అర్ధమైపోతోంది. తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు తెలీవు కానీ అసెంబ్లీ తీర్మానాన్ని పంపకపోతే మాత్రం జగన్ కు కేంద్రం షాకిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on July 30, 2021 11:40 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…