Political News

జగన్ కు కేంద్రం షాకిచ్చేలా ఉందే…

పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన ఓ జవాబు విన్న తర్వాత జగన్ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ఓ ప్రశ్నకు కంద్రమంత్రి కిరణ్ రిరిజు సమాధానమిస్తు ఏపిలో శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. మండలిలో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నయాన్న కారణంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయించిన విషయం అందరికీ తెలిసిందే.

అసెంబ్లీలో వైసీపీకి బంపర్ మెజారిటి ఉన్నట్లే శాసనమండలిలో టీడీపీకి మంచి మెజారిటి ఉండేది. ఈ కారణంతోనే అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లులు మండలిలో వీగిపోయేవి. మండలిలో తనకు బలం ఉందన్న ఏకైక కారణంతో ప్రభుత్వం పంపిన ప్రతిబిల్లుకు టీడీపీ అడ్డంపడేది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీ అడ్డుకోవటంతో అప్పట్లో బాగా గొడవలయ్యాయి. జరిగిన గొడవలతో విసిగిపోయిన జగన్ అసలు మండలినే రద్దు చేయించాలని అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. కరోనా వైరస్ కారణంగా పార్లమెంటు సమావేశాలు పెద్దగా జరగలేదు. జరిగిన సమావేశాల్లో కూడా మండలి తీర్మానం అంశం చర్చకు రాలేదు. మారిన పరిణామాల్లో మండలిలో మొన్నటి జూన్ తో వైసీపీకి ఇక్కడ కూడా మెజారిటి వచ్చేసింది. దాంతో రెండు సభల్లోను ఎదురులేకపోవటంతో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది.

ఎప్పుడైతే మండలిలో కూడా వైసీపీకి మెజారిటి వచ్చేసిందో అప్పటి నుండి మండలి రద్దుకు జగన్ కట్టబడుండాలని టీడీపీ నేతలు పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రంలో ఏ దశలో ఉందో ఎవరు పట్టించుకోలేదు. అయితే టీడీపీ ఎంపి ప్రశ్నకు మంత్రి సమాధానంతో వైసీపీ ఎంఎల్సీల్లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంటే మళ్ళీ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలి.

మండలిలో మెజారిటి వచ్చేసిందన్న ఉద్దేశ్యంతో రద్దు తీర్మానంపై అధికారపార్టీ పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. ఇపుడు గనుక కేంద్రం మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే జగన్ కు చాలా ఇబ్బందనే చెప్పాలి. మంత్రి ప్రకటన ప్రకారం మండలి రద్దు అంశంపై రాష్ట్రప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదన్న విషయం అర్ధమైపోతోంది. తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు తెలీవు కానీ అసెంబ్లీ తీర్మానాన్ని పంపకపోతే మాత్రం జగన్ కు కేంద్రం షాకిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on July 30, 2021 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు బాస్

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

1 hour ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

1 hour ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

4 hours ago

అవును… కళ్యాణ్ రామ్ సరసన ఆమెనే

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…

6 hours ago

పో* వెబ్ సైట్లో ఫొటో… జాన్వి షాక్

ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…

6 hours ago