Political News

జ‌గ‌న్ అస‌లు వ్యూహం వేరే ?

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని ఎప్పుడు విస్త‌రిస్తారు ? ఎంత‌మందిని తొల‌గిస్తారు ? ఎలా ఉంటుంది ? ఈ సారి కూడా సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కే ప్రాధాన్యం ఇస్తారా ? ఇస్తే.. మాకు కూడా చోటు ఉంటుందా ? ఇదీ కొన్నాళ్లుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. జ‌గ‌న్ వ్యూహానికి నేత‌ల ఆలోచ‌న‌ల‌కు మ‌ధ్య ఎక్క‌డా పొంతన కుద‌ర‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌తి ఒక్క‌రూ మంత్రి వ‌ర్గంలో సీటు మాత్ర మే చూసుకుంటున్నారు. కానీ.. స‌ద‌రు సీటు ద్వారా.. ఎంత మంది ప్ర‌జ‌ల‌ను వైసీపీకి చేరువ‌చేస్తారు.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుని.. పార్టీని ముందుకు న‌డిపిస్తారు.. ? వంటి అంశాల‌పై జ‌గ‌న్ దృష్టి పెడుతున్నారు.

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్తరణతో తక్షణ ప్రయోజనాలేవీ లేవని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, 2024 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సీఎం జగన్ విస్తరణను వినియోగించుకో బోతున్నారని ప‌రిశీల‌కులు చెబుతున్నారు సీఎంగా ప్ర‌మాణం చేయ‌కముందుగానే.. రెండేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని జగన్ ముందుగానే చెప్పారు. అయితే టైమ్ దగ్గరపడుతున్నా దానికి సంబంధించిన సిగ్నల్స్ ఇంకా అందలేదు. ఇటీవలే నామినేటెడ్ పోస్టుల‌ భర్తీతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు కూడా త్వ‌ర‌లోనే సిగ్న‌ల్ ఇస్తార‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

ఇప్పుడు ఏపీలో జరిగే మంత్రివర్గ విస్తరణను కేవలం మంత్రి పదవుల పంపకంగా చూడబోర‌ని అంటున్నారు సీనియ‌ర్లు. రాబోయే ఎన్నికల టీమ్‌గా జ‌గ‌న్ ట్రీట్ చేయ‌నున్నార‌ని తెలుస్తొంది. రాబోయే రెండున్నరేళ్లు మంత్రులుగా పనిచేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి దూసుకుపోయే వాళ్లతోనే కొత్త టీమ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాంటి కీలకమైన ఎన్నికల టీమ్‌తో .. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను బ‌లంగా ఢీకొట్టాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే జ‌ర‌గున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో యువకులకు ఎక్కువ‌గా పదవులు దక్కుతాయ‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే మ‌రోసారి సీనియ‌ర్ల‌కు మొండి చేయి త‌ప్ప‌ద‌నే అంటున్నారు. పార్టీ కోసం వాయిస్ వినిపించ‌లేని వాళ్లు… సీనియార్టీ పేరుతో పెద్ద‌రికం వెల‌గ‌బెట్టాల‌ని చూసే నేత‌ల‌ను ఈ సారి కూడా జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేస్తార‌నే తెలుస్తోంది. అయితే గియితే సీనియ‌ర్ల‌కు నామినేటెడ్ ప‌ద‌వులో లేదా ఇత‌ర‌త్రా మేళ్లు చేకూర్చ‌డ‌మే త‌ప్పా ప‌ద‌వులు అలంకారంగా పెట్టుకునే వాళ్ల‌ను మాత్రం ఈ సారి జ‌గ‌న్ కేబినెట్లోకి తీసుకోర‌నే తెలుస్తోంది

This post was last modified on July 29, 2021 8:39 am

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

6 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

6 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

9 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

9 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

10 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

10 hours ago