లాక్ డౌన్ వేళ.. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వలసకార్మికులు అనుభవించిన కష్టాలు అన్ని ఇన్ని కావు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ దేశంలోని పేదలకు ఇంతటి దారుణమైన కష్టం రావటమా? అని వేదన చెందిన వారికి కొదవ లేదు. సొంతూరుకు వెళ్లాలన్న పట్టుదలతో మండే ఎండలో వందలాది కిలోమీటర్లు కాలి నడకన వెళ్లిన వైనం కడుపు తరుక్కుపోయేలా చేసింది.
పసిపిల్లలు.. చిన్నారులు.. ఇంటి సామాన్లు మోసుకుంటూ సొంతూళ్లకు పయనమైన వారికి కలిగిన కష్టాలు పగోడికి కూడా రాకూడని పరిస్థితి. వలస కార్మికులు వారి ఊళ్లకు పంపటంలో ప్రభుత్వాలు సైతం కిందామీదా పడిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించి అందరి నోళ్లలో నానుతున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్.
రీల్ విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితుడైన సోనూసూద్ వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా చేస్తున్న ఏర్పాట్లు అన్ని ఇన్ని కావు. వారి కోసం ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయటం దగ్గర నుంచి.. ఆహారం లాంటి ఏర్పాట్లు ఎన్నింటినో ఆయన చేస్తున్నారు. తాజాగా సోనూసూద్ పనితీరును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో సోనూ సూద్ స్పందించిన తీరుకు తానెంతో గర్విస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఒక నటుడు ఇంత చేసినప్పుడు.. రీల్ లైఫ్ లో హీరోలుగా చెలరేగిపోయే బడా స్టార్లు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టరు? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. విపత్తు ఎదురైనప్పుడు ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వటంతోనే పని పూర్తి అయినట్లు కాకుండా.. ప్రజలకు నిజంగా అవసరమైనవి ఏమిటన్న విషయాల్ని గుర్తించి సాయం చేస్తే మరింత బాగుంటుంది.
This post was last modified on May 25, 2020 10:46 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…