Political News

ఎంపి విషయంలో రూటుమార్చిన పార్టీ

తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలు వ్యూహాన్ని మార్చారు. ఇంతకాలం అనర్హతకు మాత్రమే డిమాండ్ చేస్తున్న పార్టీ ఇపుడు అరెస్టుపైన డిమాండ్ మొదలుపెట్టింది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ను కలవటం ఇందులో భాగమే. ఎంపిపై అనర్హత వేటు వేయాలని గడచిన ఏడాదిగా వైసీపీ ఎంపిలు ఇచ్చిన లేఖలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పట్టించుకోలేదు. స్పీకర్ పట్టించుకోలేదు అనేకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని చెప్పటమే సబబుగా ఉంటుంది.

ఈ కారణంగానే ఎంపిలు స్పీకర్+అమిత్ ను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. కేంద్రంపై ఒత్తిడి పెడితే తప్ప ఉపయోగం కనబడదని అర్ధమైపోయింది. దాంతో ఒత్తిడి పెంచటానికి పార్లమెంటు సమావేశాలనే వేదికగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. వెంటనే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రప్రయోజనాలు+రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కూడా వైసీపీ ఎంపిలు కలిశారు.

కేంద్రమంత్రిని కలిసిన వైసీపీ ఎంపిలు తిరుగుబాటు ఎంపిపై మనీల్యాండరింగ్, హవాలా చట్టం కింద కేసులు నమోదు చేయాలంటు డిమాండ్ మొదలుపెట్టారు. ఎంపికి టీవీ 5 యాజమాన్యానికి 10 లక్షల యూరోల బదిలీ అంశానికి సంబంధించిన సాక్ష్యాలను కేంద్రమంత్రి ముందుంచారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు అనర్హత వేటు వేయటం ఒకటి, మనీల్యాండరింగ్, హవాలా చట్టాల క్రింద కేసు పెట్టితీరాలనేట్లుగా ఎంపిలు డిమాండ్లు చేస్తున్నారు.

కేంద్రమంత్రిని కలిసి వైసీపీ ఎంపిలు చేస్తున్న డిమాండ్లతో ఎంపిపైనా వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇంతకాలం అనర్హత వేటు వేయించటం మీద మాత్రమే దృష్టిపెట్టిన వైసీపీ నాయకత్వం తాజాగా ఏకంగా అరెస్టు విషయంలో పట్టుబడుతోంది. సో పార్టీ ఎంపిల వ్యవహారం చూస్తుంటే ఎలాగైనా రఘురామను అరెస్టు+అనర్హతకు గురిచేయాలనే పట్టుదలతో ఉన్నారని తెలిసిపోతోంది. ఇదే సమయంలో ఎంపి కూడా జగన్ బెయిల్ రద్దుకు చేయాల్సిన అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు సఫలమవుతాయో చూడాల్సిందే.

This post was last modified on July 28, 2021 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

28 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

4 hours ago