Political News

ఎంపి విషయంలో రూటుమార్చిన పార్టీ

తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలు వ్యూహాన్ని మార్చారు. ఇంతకాలం అనర్హతకు మాత్రమే డిమాండ్ చేస్తున్న పార్టీ ఇపుడు అరెస్టుపైన డిమాండ్ మొదలుపెట్టింది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ను కలవటం ఇందులో భాగమే. ఎంపిపై అనర్హత వేటు వేయాలని గడచిన ఏడాదిగా వైసీపీ ఎంపిలు ఇచ్చిన లేఖలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పట్టించుకోలేదు. స్పీకర్ పట్టించుకోలేదు అనేకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని చెప్పటమే సబబుగా ఉంటుంది.

ఈ కారణంగానే ఎంపిలు స్పీకర్+అమిత్ ను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. కేంద్రంపై ఒత్తిడి పెడితే తప్ప ఉపయోగం కనబడదని అర్ధమైపోయింది. దాంతో ఒత్తిడి పెంచటానికి పార్లమెంటు సమావేశాలనే వేదికగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. వెంటనే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రప్రయోజనాలు+రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కూడా వైసీపీ ఎంపిలు కలిశారు.

కేంద్రమంత్రిని కలిసిన వైసీపీ ఎంపిలు తిరుగుబాటు ఎంపిపై మనీల్యాండరింగ్, హవాలా చట్టం కింద కేసులు నమోదు చేయాలంటు డిమాండ్ మొదలుపెట్టారు. ఎంపికి టీవీ 5 యాజమాన్యానికి 10 లక్షల యూరోల బదిలీ అంశానికి సంబంధించిన సాక్ష్యాలను కేంద్రమంత్రి ముందుంచారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు అనర్హత వేటు వేయటం ఒకటి, మనీల్యాండరింగ్, హవాలా చట్టాల క్రింద కేసు పెట్టితీరాలనేట్లుగా ఎంపిలు డిమాండ్లు చేస్తున్నారు.

కేంద్రమంత్రిని కలిసి వైసీపీ ఎంపిలు చేస్తున్న డిమాండ్లతో ఎంపిపైనా వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇంతకాలం అనర్హత వేటు వేయించటం మీద మాత్రమే దృష్టిపెట్టిన వైసీపీ నాయకత్వం తాజాగా ఏకంగా అరెస్టు విషయంలో పట్టుబడుతోంది. సో పార్టీ ఎంపిల వ్యవహారం చూస్తుంటే ఎలాగైనా రఘురామను అరెస్టు+అనర్హతకు గురిచేయాలనే పట్టుదలతో ఉన్నారని తెలిసిపోతోంది. ఇదే సమయంలో ఎంపి కూడా జగన్ బెయిల్ రద్దుకు చేయాల్సిన అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు సఫలమవుతాయో చూడాల్సిందే.

This post was last modified on July 28, 2021 11:47 am

Share
Show comments
Published by
satya

Recent Posts

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 mins ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

24 mins ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

1 hour ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

2 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

3 hours ago

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

4 hours ago