కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయన సీఎం పదవి చేపట్టిన రెండేళ్లకే.. ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే.. రాజీనామా చేసే సమయంలో ఆయన బాగా ఎమోషనల్ కూడా అయ్యారు.
అయితే.. సీఎం పదవి నుంచి తప్పించినా.. ఆయనకు మరో కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి సేవ చేసిన యడియూరప్పను సమున్నత రీతిలో గౌరవించాలని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. ఆంధ్రప్రదేశ్ కి గానీ.. మరో రాష్ట్రానికి గానీ ఆయన్ను గవర్నర్ గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి యడియూరప్ప హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడనే చెప్పాలి. ఢిల్లీ నుంచి కబురు రాగానే.. వెళ్లి చర్చలు జరిపి రాగానే రాజీనామా చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయన్ను గవర్నర్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ గవర్నర్ పదవి అప్పగించే వార్త కూడా.. మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 27, 2021 6:10 pm
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…