కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయన సీఎం పదవి చేపట్టిన రెండేళ్లకే.. ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే.. రాజీనామా చేసే సమయంలో ఆయన బాగా ఎమోషనల్ కూడా అయ్యారు.
అయితే.. సీఎం పదవి నుంచి తప్పించినా.. ఆయనకు మరో కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి సేవ చేసిన యడియూరప్పను సమున్నత రీతిలో గౌరవించాలని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. ఆంధ్రప్రదేశ్ కి గానీ.. మరో రాష్ట్రానికి గానీ ఆయన్ను గవర్నర్ గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి యడియూరప్ప హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడనే చెప్పాలి. ఢిల్లీ నుంచి కబురు రాగానే.. వెళ్లి చర్చలు జరిపి రాగానే రాజీనామా చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయన్ను గవర్నర్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ గవర్నర్ పదవి అప్పగించే వార్త కూడా.. మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 27, 2021 6:10 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…