కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయన సీఎం పదవి చేపట్టిన రెండేళ్లకే.. ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే.. రాజీనామా చేసే సమయంలో ఆయన బాగా ఎమోషనల్ కూడా అయ్యారు.
అయితే.. సీఎం పదవి నుంచి తప్పించినా.. ఆయనకు మరో కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి సేవ చేసిన యడియూరప్పను సమున్నత రీతిలో గౌరవించాలని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. ఆంధ్రప్రదేశ్ కి గానీ.. మరో రాష్ట్రానికి గానీ ఆయన్ను గవర్నర్ గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి యడియూరప్ప హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడనే చెప్పాలి. ఢిల్లీ నుంచి కబురు రాగానే.. వెళ్లి చర్చలు జరిపి రాగానే రాజీనామా చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయన్ను గవర్నర్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ గవర్నర్ పదవి అప్పగించే వార్త కూడా.. మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…