Political News

ఎవరీ ఉండవల్లి అనూష..

విమర్శ కఠినంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలనుకునే నాయకత్వం తెరమరుగైపోయింది. విషయం ఏదైనా.. ఎప్పుడైనా పొగడాలే తప్పించి.. విమర్శలు చేసినా.. ఆరోపణలు చేసినా భరించే పరిస్థితుల్లో నాయకత్వాలు ఉంటున్నాయి.

తాను విపక్ష నేతగా ఉన్న వేళలో.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టే వారికి తాను రక్షకుడిగా ఉంటానని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడాయన ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. విమర్శలు చేసినా వ్యవస్థల ద్వారా నోటీసులు ఇవ్వటం.. విచారణకు పిలవటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. మొన్ననే రంగనాయకమ్మ అనే పెద్ద వయస్కురాలు ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టిన వైనం.. ఆ తర్వాతేమైందో తెలిసిందే. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఉదంతం నేపథ్యంలో..రంగనాయకమ్మ తన ఆవేదనను తనకొచ్చిన ఫేస్ బుక్ పోస్టును తన పేజీలో పోస్టు చేశారు. అంతే.. ఆమె సీఐడీ నుంచి విచారణ నోటీసుల్ని ఎదుర్కొన్నారు.

మొన్ననే సీఐడీ అధికారులు రంగనాయకమ్మను విచారణకు పిలిచి ఏకంగా రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. తనకు మరే ఉద్దేశాలు లేవని.. తన వరకు వచ్చిన అంశాన్ని పోస్టు మాత్రమే చేశానని రంగనాయకమ్మ చెబుతున్నారు. ఆమె ఉదంతం ఒక కొలిక్కి రాకముందే పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూషకు సీఐడీనుంచి నోటీసులు అందాయి. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూస్తే ముక్కున వేలేసుకోవాల్సింది.

27 ఏళ్ల అనూష.. జగన్ ప్రభుత్వం చేసే తప్పుల్ని.. పాలనలో సాగుతన్న నిర్లక్ష్యాల్ని.. అలక్ష్యాన్ని పోస్టుల రూపంలో ప్రశ్నించటం ఆమెకు అలవాటు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కించిత్ వ్యతిరేకత కనిపించినా.. ప్రజల్లోకి వెళ్లి ప్రభావం చూపిస్తుందన్న సందేహం వస్తే చాలు వారిని ఆడా.. మగా అన్నది తేడా లేకుండా స్టేషన్ కు తీసుకొచ్చేస్తున్నారు. విచారణతో చుక్కలు చూపిస్తున్నారు.

ఆ కోవకు చెందినదే.. ఉండవల్లి అనూష (24)కు అలాంటి అనుభవమే తాజాగా ఎదురైంది. తరచూ జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించేలా వీడియోలు పెడుతున్నారని.. దీనికి సంబంధించిన వివరాల్ని మూడు రోజుల్లో వచ్చి చెప్పాలని.. లేనిపక్షంలో అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఏమైనా సోషల్ మీడియాలో స్వేచ్చను తనకున్న అధికారంతో అడ్డుకుంటున్నారన్న విమర్శలు జగన్ ప్రభుత్వం మీద రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి వినిపిస్తాయో?

This post was last modified on May 24, 2020 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

54 minutes ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

2 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

3 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago