విమర్శ కఠినంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలనుకునే నాయకత్వం తెరమరుగైపోయింది. విషయం ఏదైనా.. ఎప్పుడైనా పొగడాలే తప్పించి.. విమర్శలు చేసినా.. ఆరోపణలు చేసినా భరించే పరిస్థితుల్లో నాయకత్వాలు ఉంటున్నాయి.
తాను విపక్ష నేతగా ఉన్న వేళలో.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టే వారికి తాను రక్షకుడిగా ఉంటానని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడాయన ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. విమర్శలు చేసినా వ్యవస్థల ద్వారా నోటీసులు ఇవ్వటం.. విచారణకు పిలవటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. మొన్ననే రంగనాయకమ్మ అనే పెద్ద వయస్కురాలు ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టిన వైనం.. ఆ తర్వాతేమైందో తెలిసిందే. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఉదంతం నేపథ్యంలో..రంగనాయకమ్మ తన ఆవేదనను తనకొచ్చిన ఫేస్ బుక్ పోస్టును తన పేజీలో పోస్టు చేశారు. అంతే.. ఆమె సీఐడీ నుంచి విచారణ నోటీసుల్ని ఎదుర్కొన్నారు.
మొన్ననే సీఐడీ అధికారులు రంగనాయకమ్మను విచారణకు పిలిచి ఏకంగా రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. తనకు మరే ఉద్దేశాలు లేవని.. తన వరకు వచ్చిన అంశాన్ని పోస్టు మాత్రమే చేశానని రంగనాయకమ్మ చెబుతున్నారు. ఆమె ఉదంతం ఒక కొలిక్కి రాకముందే పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూషకు సీఐడీనుంచి నోటీసులు అందాయి. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూస్తే ముక్కున వేలేసుకోవాల్సింది.
27 ఏళ్ల అనూష.. జగన్ ప్రభుత్వం చేసే తప్పుల్ని.. పాలనలో సాగుతన్న నిర్లక్ష్యాల్ని.. అలక్ష్యాన్ని పోస్టుల రూపంలో ప్రశ్నించటం ఆమెకు అలవాటు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కించిత్ వ్యతిరేకత కనిపించినా.. ప్రజల్లోకి వెళ్లి ప్రభావం చూపిస్తుందన్న సందేహం వస్తే చాలు వారిని ఆడా.. మగా అన్నది తేడా లేకుండా స్టేషన్ కు తీసుకొచ్చేస్తున్నారు. విచారణతో చుక్కలు చూపిస్తున్నారు.
ఆ కోవకు చెందినదే.. ఉండవల్లి అనూష (24)కు అలాంటి అనుభవమే తాజాగా ఎదురైంది. తరచూ జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించేలా వీడియోలు పెడుతున్నారని.. దీనికి సంబంధించిన వివరాల్ని మూడు రోజుల్లో వచ్చి చెప్పాలని.. లేనిపక్షంలో అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
ఏమైనా సోషల్ మీడియాలో స్వేచ్చను తనకున్న అధికారంతో అడ్డుకుంటున్నారన్న విమర్శలు జగన్ ప్రభుత్వం మీద రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి వినిపిస్తాయో?
This post was last modified on May 24, 2020 9:52 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…