Political News

ఎవరీ ఉండవల్లి అనూష..

విమర్శ కఠినంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలనుకునే నాయకత్వం తెరమరుగైపోయింది. విషయం ఏదైనా.. ఎప్పుడైనా పొగడాలే తప్పించి.. విమర్శలు చేసినా.. ఆరోపణలు చేసినా భరించే పరిస్థితుల్లో నాయకత్వాలు ఉంటున్నాయి.

తాను విపక్ష నేతగా ఉన్న వేళలో.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టే వారికి తాను రక్షకుడిగా ఉంటానని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడాయన ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. విమర్శలు చేసినా వ్యవస్థల ద్వారా నోటీసులు ఇవ్వటం.. విచారణకు పిలవటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. మొన్ననే రంగనాయకమ్మ అనే పెద్ద వయస్కురాలు ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టిన వైనం.. ఆ తర్వాతేమైందో తెలిసిందే. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఉదంతం నేపథ్యంలో..రంగనాయకమ్మ తన ఆవేదనను తనకొచ్చిన ఫేస్ బుక్ పోస్టును తన పేజీలో పోస్టు చేశారు. అంతే.. ఆమె సీఐడీ నుంచి విచారణ నోటీసుల్ని ఎదుర్కొన్నారు.

మొన్ననే సీఐడీ అధికారులు రంగనాయకమ్మను విచారణకు పిలిచి ఏకంగా రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. తనకు మరే ఉద్దేశాలు లేవని.. తన వరకు వచ్చిన అంశాన్ని పోస్టు మాత్రమే చేశానని రంగనాయకమ్మ చెబుతున్నారు. ఆమె ఉదంతం ఒక కొలిక్కి రాకముందే పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూషకు సీఐడీనుంచి నోటీసులు అందాయి. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూస్తే ముక్కున వేలేసుకోవాల్సింది.

27 ఏళ్ల అనూష.. జగన్ ప్రభుత్వం చేసే తప్పుల్ని.. పాలనలో సాగుతన్న నిర్లక్ష్యాల్ని.. అలక్ష్యాన్ని పోస్టుల రూపంలో ప్రశ్నించటం ఆమెకు అలవాటు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కించిత్ వ్యతిరేకత కనిపించినా.. ప్రజల్లోకి వెళ్లి ప్రభావం చూపిస్తుందన్న సందేహం వస్తే చాలు వారిని ఆడా.. మగా అన్నది తేడా లేకుండా స్టేషన్ కు తీసుకొచ్చేస్తున్నారు. విచారణతో చుక్కలు చూపిస్తున్నారు.

ఆ కోవకు చెందినదే.. ఉండవల్లి అనూష (24)కు అలాంటి అనుభవమే తాజాగా ఎదురైంది. తరచూ జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించేలా వీడియోలు పెడుతున్నారని.. దీనికి సంబంధించిన వివరాల్ని మూడు రోజుల్లో వచ్చి చెప్పాలని.. లేనిపక్షంలో అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఏమైనా సోషల్ మీడియాలో స్వేచ్చను తనకున్న అధికారంతో అడ్డుకుంటున్నారన్న విమర్శలు జగన్ ప్రభుత్వం మీద రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి వినిపిస్తాయో?

This post was last modified on May 24, 2020 9:52 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

2 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

4 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

4 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

5 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

6 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

6 hours ago