Political News

కర్నాటకలో బీజేపీకి ఏమన్నా శాపముందా ?

ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. మామూలుగా ఏ రాష్ట్రంలో సీనియర్ నేత ముఖ్యమంత్రయితే ఐదేళ్ళ పూర్తికాలం సీఎంగా ఉంటారు. మధ్యలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చి కోర్టుల్లో నిరూపణైతే మాత్రం మధ్యలోన పక్కకు తప్పుకుంటారు. అయితే కర్నాటకలో మాత్రం బీజేపీకి ఏదో శాపం ఉన్నట్లే అనిపిస్తోంది. అందుకనే అధికారంలోకి వస్తున్నా ఎవరు కూడా పూర్తి కాలం అధికారంలో ఉండలేకపోతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ దశాబ్దాలుగా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత కర్నాకటలో బోణికొట్టింది. మొదటసారిగా 2004లో 224 సీట్లలో అత్యధికంగా 79 సీట్లు గెలుచుకుని అధికారానికి దగ్గరైంది. అయితే కాంగ్రెస్+జేడీఎస్ పార్టీలు ఒకటవ్వటంతో బీజేపీకి నిరాసే ఎదురైంది. ఆ తర్వాత జేడీఎస్ తో బీజేపీ 2007లో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది.

అయితే అవినీతి ఆరోపణలతో యడ్యూరప్ప రాజీనామా చేయాల్సొచ్చింది. అప్పటినుండి సీఎంలుగా బాధ్యతలు తీసుకన్న బీజేపీ సీనియర్లు ఎవరు సీఎం పదవిని పూర్తికాలం అనుభవించిందిలేదు. యడ్డీ తర్వాత సీఎం అయిన సదానంద గౌడ్ కూడా మధ్యలోనే రాజీనామా చేసేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జగదీష్ శెట్టర్ పదవి కూడా మధ్యలోనే ముగిసిపోయింది. ఆ తర్వాత యడ్డీ మరో మూడుసార్లు సీఎంగా బాధ్యతలు తీసుకున్నా ఎప్పుడు కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు.

జరుగుతున్నది చూసిన తర్వాత కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వస్తోందని సంతోషించాలో లేకపోతే ముఖ్యమంత్రి పదవిని ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా ఐదేళ్ళు పూర్తిచేయలేదని బాధపడాలో కమలనాదులకే అర్ధం కావటంలేదు. ఇపుడు కూడా యడ్డీ స్ధానంలో సీఎం అవ్వబోయే నేతకు మిగిలిన పదవీ కాలం మూడేళ్ళు మాత్రమే. మరి ఈ మూడేళ్ళయినా ఒకరే పదవిలో ఉంటారా ? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on July 27, 2021 12:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

35 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago