కొన్ని సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాల్సుంటుంది. అలా కాకుండా వీలున్నంత కాలం సాగదీద్దామని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇపుడిదంతా ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు, మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు రెడీ అవుతున్నారు. పెన్షన్ విధానంలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమల్లోకి తేవాలనే డిమాండ్ తో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె యోచన చేస్తున్నారు.
ఇదే సమయంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసే యోచనాలో ఉన్నారు. ఈ విషయాన్ని డిసైడ్ చేయటానికి మంగళవారం సమావేశం కూడా పెట్టబోతున్నారు. దీనికి ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, నేషనల్ మజ్డూర్ యూనియన్ నేతలు పార్టిసిపేట్ చేయబతోన్నారు. మూడు యూనియన్లు కూడా ఆర్టీసీలో బలమైనవే. సమ్మె విషయంలో మూడు యూనియన్లు కలిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.
నిజానికి అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు విధానాన్ని రద్దు చేస్తానని పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే వివిధ కారణాలతో ఆ విషయమై దృష్టిపెట్టలేదు. ఉద్యోగుల సెగ మొదలైన తర్వాత సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం ఈమధ్యనే కమిటిని నియమించింది. అయితే కమిటిని నియమించటం కాదని ఏకంగా రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ ను పట్టించుకోకపోతే తొందరలోనే సమ్మెకు దిగటమే మార్గమని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఇదే సమయంలో ఆర్టీసీలో కూడా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా తమ సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉందని యూనియన్ నేతలంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పెద్దగా ఉపయోగం కనబడలేదని నేతలకు మంటగా ఉంది. విజ్ఞప్తులు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు కాబట్టి సమ్మెకు దిగటమే ఏకైక మార్గంగా నేతలంటున్నారు. ఈ విషయాన్ని తేల్చటానికే విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒకేసారి ఇటు ఉద్యోగులు అటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. కాబట్టి వెంటనే జగన్ మేల్కొనకపోతే కష్టమే.
This post was last modified on July 27, 2021 11:47 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…