ఎట్టకేలకు చంద్రబాబు హైదరాబాదు వీడనున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లడానికి ఇరు రాష్ట్రాల డీజీపీలు అనుమతి ఇచ్చారు. ఉగాది సమయంలో కుటుంబంతో హైదరాబాదు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సడెన్ లాక్ డౌన్ తో ఇక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హైదరాబాదులో ఉన్నాడు. అక్కడ దాక్కున్నాడు అంటూ అధికార పార్టీ నేతలు పలుమార్లు విమర్శించిన విషయం విదితమే. అయితే, లాక్ డౌన్ వల్ల ఉండిపోవాల్సి వచ్చిందని, నిబంధనలు అనుమతించక ఇక్కడే ఉండిపోయానని అందరికీ కలిపి ఒకసారి చంద్రబాబు మీడియాముఖంగా సమాధానమిచ్చారు.
అయితే, అనుకోని విధంగా ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరగడంతో వెంటనే బాధితుల పరామర్శ కోసం అక్కడికి వెళ్లడానికి చంద్రబాబు ప్రత్యేక విమానం కోసం అనుమతి కోరారు. ఏవో కొన్ని కారణాల వల్ల దానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో అపుడు చంద్రబాబు అక్కడికి వెళ్లలేకపోయారు. తాజాగా విశాఖ పర్యటనకు వెళ్లాలని ఇరు రాష్ట్రాల డీజీపీలకు దరఖాస్తు పెట్టుకోవడంతో ఇరువురు ఆమోదం తెలిపారు. ఈ దరఖాస్తులో చంద్రబాబు, లోకేష్, శ్రీనివాస్ అనే మరొక వ్యక్తికి అనుమతి లభించింది.
విమాన ప్రయాణాలు రేపటి నుంచి ప్రారంభం కావడంతో చంద్రబాబు ఉదయం 10 గంటలకు తొలి విమానంలోనే విశాఖకు చేరుకోనున్నారు. విశాఖ సుదూరం కావడంతో అంతదూరం చంద్రబాబు రోడ్డు ప్రయాణం చేయలేకనే విమాన సర్వీసులు ప్రారంభం అయిన వెంటనే పర్యటన ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాదు నుంచి నేరుగా విశాఖ శివారులోని ఆర్ ఆర్ వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖ పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో చంద్రబాబు విశాఖ నుంచి అమరావతి చేరుకుంటారు.
కొద్దిరోజుల క్రితం విశాఖ పర్యటనకు చంద్రబాబు వెళ్లినపుడు వైసీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా ఆందోళన చేయడం, భద్రత రీత్యా పోలీసులు చంద్రబాబును వెనక్కు పంపడం తెలిసిందే. అనుమతి ఉండగా బాబు టూరును ఎలా అడ్డుకుంటారు అంటూ చంద్రబాబు కోర్టుకు వెళ్లడంతో డీజీపీని హైకోర్టు పిలిపించి వివరణ కోరింది. అప్పట్లో ఇది సంచనలం అవగా.. మళ్లీ విశాఖ కచ్చితంగా వస్తాను అంటూ ఆరోజు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వాస్తవరూపం దాలుస్తున్నాయి.
This post was last modified on May 24, 2020 9:29 pm
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…