కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న ఆయనను రాజీనామా చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. సీఎంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు. ఈ రెండు సంవత్సరాలు తాను ఏనాడూ సంతోషంగా లేనని, ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. నాలుగోసారి సీఎంగా పదవి చేపట్టిన ఆయన ఏ ఒక్కసారి కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని ఆయన పూర్తి చేయలేకపోయారు. తన రెండెళ్ల పాలనపై యడ్యూరప్ప మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సాయంత్రమే బీజేపీ అధినాయకత్వం కొత్త సీఎం పేరును ఖరారు చేయనుంది.
కర్ణాటకలో కాంగ్రెస్-జెడీఎస్ కూటమి అధికారం చేపట్టిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ స్థానంలో యడ్యూరప్ప అధికారాన్ని చేపట్టారు.
కాగా.. యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా మురుగేష్ నిరాని, ప్రహ్లాజ్ జోషీ, అరవింద్ బళ్లాడ్ పేర్లు బిజెపి అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 26, 2021 2:34 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…