Political News

బిగ్ బ్రేకింగ్ – ఎల్జీ పాలిమర్స్ సీజ్

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అమానవీయ ఘోరకలికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీని వెంటనే సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం శివారులోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ విష వాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అపార జంతు నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్న హైకోర్టు తాజాగా ఆ కంపెనీని సీజ్ చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కీలక తీర్పులో హైకోర్టు ఏం ఆదేశించిందంటే.. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని పేర్కొనడంతో పాుట ఇకపై కంపెనీలోకి ఎవ్వరినీ అనుమతించొద్దని ఆదేశించింది. అంతేగాకుండా ఆ కంపెనీ డైరెక్టర్లు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. వెంటనే డైరెక్టర్లు తమంతట తాము పాస్ పోర్టులను కోర్టుకు స్వాధీన పరచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ తాజా ఆదేశాలతో కార్పరేట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొద్దిరోజులుగా ఈ కేసును హైకోర్టు విచారిస్తుండగా… కంపెనీ ప్రతినిధులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు విచారణ ఆపేలా ఆదేశాలివ్వాలని ఒక విచిత్రమైన పిటిషను వేసిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు వారి పిటిషను కొట్టేసి… హైకోర్టు, ఎన్జీటీలోనే తేల్చుకోవాలని తిప్పిపంపింది. తాజాగా హైకోర్టు కంపెనీ సీజ్ చేయడానికి ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వం తరఫున, ఎల్‌జీ పాలిమర్స్ తరపున హైకోర్టుకు వాదనలు విన్పించారు. ఈ సందర్భంగా ఇరువురికీ హైకోర్టు ఒక కీలక ప్రశ్న వేసింది. గ్యాస్ లీకేజీ తర్వాత స్టైరీన్‌ను ఇక్కడి నుంచి ఎవరి అనుమతితో తరలించారని కోర్టు ప్రశ్నించింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా… ప్రమాదం అనంతరం ఒక్క లీటరు స్టైరీన్ విశాఖలో ఉండటానికి వీల్లేదంటూ ప్రభుత్వం చెప్పడం, కంపెనీ స్టైరీన్ ను దేశం దాటించడం, మధ్యలో ఒకసారి మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ స్టైరీన్ ఇంకా కొంచెం మిగిలి ఉంది అని కంపెనీ చెప్పిందని… తరలిస్తాం అని చెబితే తరలించుకోండి అని చెప్పామని స్వయంగా పేర్కొన్నారు. ప్రమాదం పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆనాడు స్టైరీన్ ను తరలించడానికి ఓకే చెప్పారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో స్టైరీన్ తరలింపుపై హైకోర్టు వేసిన ప్రశ్న… కొత్త ట్విస్ట్.

This post was last modified on May 24, 2020 9:26 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

7 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

8 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

9 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

10 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago