Political News

బిగ్ బ్రేకింగ్ – ఎల్జీ పాలిమర్స్ సీజ్

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అమానవీయ ఘోరకలికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీని వెంటనే సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం శివారులోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ విష వాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అపార జంతు నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్న హైకోర్టు తాజాగా ఆ కంపెనీని సీజ్ చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కీలక తీర్పులో హైకోర్టు ఏం ఆదేశించిందంటే.. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని పేర్కొనడంతో పాుట ఇకపై కంపెనీలోకి ఎవ్వరినీ అనుమతించొద్దని ఆదేశించింది. అంతేగాకుండా ఆ కంపెనీ డైరెక్టర్లు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. వెంటనే డైరెక్టర్లు తమంతట తాము పాస్ పోర్టులను కోర్టుకు స్వాధీన పరచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ తాజా ఆదేశాలతో కార్పరేట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొద్దిరోజులుగా ఈ కేసును హైకోర్టు విచారిస్తుండగా… కంపెనీ ప్రతినిధులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు విచారణ ఆపేలా ఆదేశాలివ్వాలని ఒక విచిత్రమైన పిటిషను వేసిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు వారి పిటిషను కొట్టేసి… హైకోర్టు, ఎన్జీటీలోనే తేల్చుకోవాలని తిప్పిపంపింది. తాజాగా హైకోర్టు కంపెనీ సీజ్ చేయడానికి ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వం తరఫున, ఎల్‌జీ పాలిమర్స్ తరపున హైకోర్టుకు వాదనలు విన్పించారు. ఈ సందర్భంగా ఇరువురికీ హైకోర్టు ఒక కీలక ప్రశ్న వేసింది. గ్యాస్ లీకేజీ తర్వాత స్టైరీన్‌ను ఇక్కడి నుంచి ఎవరి అనుమతితో తరలించారని కోర్టు ప్రశ్నించింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా… ప్రమాదం అనంతరం ఒక్క లీటరు స్టైరీన్ విశాఖలో ఉండటానికి వీల్లేదంటూ ప్రభుత్వం చెప్పడం, కంపెనీ స్టైరీన్ ను దేశం దాటించడం, మధ్యలో ఒకసారి మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ స్టైరీన్ ఇంకా కొంచెం మిగిలి ఉంది అని కంపెనీ చెప్పిందని… తరలిస్తాం అని చెబితే తరలించుకోండి అని చెప్పామని స్వయంగా పేర్కొన్నారు. ప్రమాదం పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆనాడు స్టైరీన్ ను తరలించడానికి ఓకే చెప్పారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో స్టైరీన్ తరలింపుపై హైకోర్టు వేసిన ప్రశ్న… కొత్త ట్విస్ట్.

This post was last modified on May 24, 2020 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

10 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago