Political News

బిగ్ బ్రేకింగ్ – ఎల్జీ పాలిమర్స్ సీజ్

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అమానవీయ ఘోరకలికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీని వెంటనే సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం శివారులోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ విష వాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అపార జంతు నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్న హైకోర్టు తాజాగా ఆ కంపెనీని సీజ్ చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కీలక తీర్పులో హైకోర్టు ఏం ఆదేశించిందంటే.. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని పేర్కొనడంతో పాుట ఇకపై కంపెనీలోకి ఎవ్వరినీ అనుమతించొద్దని ఆదేశించింది. అంతేగాకుండా ఆ కంపెనీ డైరెక్టర్లు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. వెంటనే డైరెక్టర్లు తమంతట తాము పాస్ పోర్టులను కోర్టుకు స్వాధీన పరచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ తాజా ఆదేశాలతో కార్పరేట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొద్దిరోజులుగా ఈ కేసును హైకోర్టు విచారిస్తుండగా… కంపెనీ ప్రతినిధులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు విచారణ ఆపేలా ఆదేశాలివ్వాలని ఒక విచిత్రమైన పిటిషను వేసిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు వారి పిటిషను కొట్టేసి… హైకోర్టు, ఎన్జీటీలోనే తేల్చుకోవాలని తిప్పిపంపింది. తాజాగా హైకోర్టు కంపెనీ సీజ్ చేయడానికి ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వం తరఫున, ఎల్‌జీ పాలిమర్స్ తరపున హైకోర్టుకు వాదనలు విన్పించారు. ఈ సందర్భంగా ఇరువురికీ హైకోర్టు ఒక కీలక ప్రశ్న వేసింది. గ్యాస్ లీకేజీ తర్వాత స్టైరీన్‌ను ఇక్కడి నుంచి ఎవరి అనుమతితో తరలించారని కోర్టు ప్రశ్నించింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా… ప్రమాదం అనంతరం ఒక్క లీటరు స్టైరీన్ విశాఖలో ఉండటానికి వీల్లేదంటూ ప్రభుత్వం చెప్పడం, కంపెనీ స్టైరీన్ ను దేశం దాటించడం, మధ్యలో ఒకసారి మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ స్టైరీన్ ఇంకా కొంచెం మిగిలి ఉంది అని కంపెనీ చెప్పిందని… తరలిస్తాం అని చెబితే తరలించుకోండి అని చెప్పామని స్వయంగా పేర్కొన్నారు. ప్రమాదం పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆనాడు స్టైరీన్ ను తరలించడానికి ఓకే చెప్పారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో స్టైరీన్ తరలింపుపై హైకోర్టు వేసిన ప్రశ్న… కొత్త ట్విస్ట్.

This post was last modified on May 24, 2020 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

15 minutes ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

2 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

4 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

11 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

11 hours ago