Political News

కేసీఆర్ వి అన్నీ పెగ్గు పథకాలే.. బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించాడు. హుజురాబాద్ లో బీజేపీదే గెలుప‌ని, మొన్న‌టి వ‌ర‌కు ఈట‌లకు 50శాతం ఓట్లు ప‌డ్తాయ‌ని స‌ర్వేలు చెప్ప‌గా ఇప్పుడు 71శాతంకు పెరిగింద‌న్నారు బీజేపీ చీఫ్ బండి సంజ‌య్. ఆ నివేదిక‌ల‌తోనే కేసీఆర్ దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌న్నారు. అందుకే దళిత బంధు అంటూ మరో కొత్త డ్రామాకు కేసీఆర్ తెరతీసిండ‌ని, కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేన‌ని విమ‌ర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఇంటింటికీ 10 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడ‌ని, చివరకు నా లెటర్ ఫోర్జరీ చేసి డబ్బు పంపిణీ ఆపి ఎన్నికలయ్యాక అందరికీ డబ్బులిస్తానని చెప్పి మోసం చేసిండని సంజ‌య్ ఆరోపించారు. హుజురాబాద్ లో ఈట‌ల చేస్తున్న పాద‌యాత్ర‌కు బండి సంజ‌య్ సంఘీభావం ప్ర‌క‌టించారు.

‘కేసీఆర్ 90 ఎంఎల్ సీఎం. ఒక్క పెగ్గు వేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానంటడు. రెండు పెగ్గులు వేస్తే అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లిస్తానంటడు. మూడు పెగ్గులు వేస్తే దళితులకు మూడెకరాలు ఇస్తానంటడు. నాలుగో పెగ్గు వేసి కేటీఆర్ సీఎంను చేస్తానంటడు, ఐదో పెగ్గు పంచభూతాలను నేనే అంటడు. ఏడో పెగ్గు వేశాక అసలు నేనేమీ అనలేదని బుకాయిస్తడు. ఇదీ 90 ఎంఎల్ చరిత్ర అని బండి సంజ‌య్ అన్నారు. ఈటల రాజేందర్ ను చూస్తే నా కంట కన్నీల్లొస్తున్నయ్. చాలా కష్టపడుతుండు. కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదరకుండా తిరగుతుండు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిండు. హుజూరాబాద్ ఉద్యమ గడ్డ. ఈటల ఆధ్వర్యంలో కాషాయ జెండాను ఎగరేయండి. భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ అహంకారాన్ని దింపాలని’ సంజ‌య్ పిలుపునిచ్చారు.

హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో కేసీఆర్ మళ్లీ ‘దళిత బంధు’ అంటున్నాడ‌ని, ఈ పథకం ద్వారా ఇంటికో రూ.10 లక్షలిస్తామ‌న్న మాటల‌న్ని క‌ట్టుక‌థ‌లేన‌న్నారు. పథకం స్టార్ట్ చేసి 10 మందికో 100 వంద మందికో మాత్రమే ఇస్తాడు. తరువాత కోర్టులో పిటిషన్ వేయించి ఆపేస్తాడు. బీజేపీవల్లే, ఈటల రాజేందర్ వల్లే పథకం ఆగిపోయిందని మళ్లీ అబద్దపు ప్రచారం చేయిస్తాడ‌ని, కేసీఆర్ అబద్దాలను చూసి ఛీ…థూ..అంటూ జ‌నం అసహ్యించుకుంటున్నార‌ని సంజ‌య్ మండిప‌డ్డారు.

దేశంలో అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆర్. పాస్ పోర్టు బ్రోకర్. వేల కోట్ల రూపాయలు దండుకుని దుబాయ్, మస్కట్, అమెరికా, లండన్ వెళ్లి డబ్బులు దాచుకుని పెట్టుబడి పెడుతున్నారు. మేం అధికారంలోకి వచ్చాక అవన్నీ వెలికితీస్తం. ఆ డబ్బులన్నీ పేదల అకౌంట్లో వేస్తం. కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయం. ఎవరో అడిగారని కాదు…సమయం చూసి జైలుకు పంపడం ఖాయం అంటూ బండి సంజ‌య్ హెచ్చ‌రించారు.

This post was last modified on July 24, 2021 2:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

1 hour ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

5 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

6 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

6 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

7 hours ago