దేశంలోని అత్యంత ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రప్రభుత్వం తెలుగు సీఎంల ఫోన్లను హ్యాకింగ్ చేయించకుండా ఉంటుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సంఘ విద్రోహుల కదలికలను తెలుసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించటం కొత్తేమీకాదు. పార్టీ అధికారంలో ఉన్నా చేసేదిదే. కాకపోతే ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
అయితే ఈ విషయంలో నరేంద్రమోడి సర్కార్ ఫెయిలయ్యింది. దేశంలోని ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, కార్పొరేట్ కంపెనీల ఛైర్మన్లతో పాటు అనేకమంది ఫోన్లను కేంద్రం ట్యాప్ చేయిస్తోందనే వార్తలు దేశంలో ఇఫుడు సంచలనంగా మారింది. ఇదే విషయమై గడచిన నాలుగు రోజులుగా పార్లమెంటు అట్టుడికిపోతోంది. పార్లమెంటు లోపల, బయట ఇంత గోల జరుగుతున్న నరేంద్రమోడి మాత్రం నోరిప్పి ఏమీ మాట్లాడటంలేదు.
మోడి వైఖరితోనే ట్యాపింగ్ నిజమే అని జనాలు అనుకునేందుకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. మీడియాలో కథనాల ప్రకారం సుమారు లక్షమంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయట. ఇప్పటికి బయటపడిన పేర్లు 400 అయినా ఇంకా కొన్ని వేలమంది ట్యాపింగ్ బాధితులున్నట్లు ది వైర్ మీడియా వరసు కథనాలను ప్రచురిస్తోంది. రోజు రోజుకు బాధితుల పేర్లు బయటకువస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే తెలుగు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు చంద్రబాబునాయుడు ఫోన్ కూడా హ్యాకింగ్ అయ్యేఉంటుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకసారి ట్యాపింగ్ చేయించటం మొదలుపెడితే మిత్రులు లేరు ప్రత్యర్ధులూ ఉండరు. ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్న కారణంగానే ఎప్పటికిప్పుడు మోడి ప్రతిపక్షాల వ్యూహాలను తెలుసుకుంటున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి తాజా పెగాసస్ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 24, 2021 2:34 pm
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…