Political News

తెలుగు సీఎంల ఫోన్లు ట్యాపింగ్ చేశారా?!!

దేశంలోని అత్యంత ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రప్రభుత్వం తెలుగు సీఎంల ఫోన్లను హ్యాకింగ్ చేయించకుండా ఉంటుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సంఘ విద్రోహుల కదలికలను తెలుసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించటం కొత్తేమీకాదు. పార్టీ అధికారంలో ఉన్నా చేసేదిదే. కాకపోతే ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

అయితే ఈ విషయంలో నరేంద్రమోడి సర్కార్ ఫెయిలయ్యింది. దేశంలోని ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, కార్పొరేట్ కంపెనీల ఛైర్మన్లతో పాటు అనేకమంది ఫోన్లను కేంద్రం ట్యాప్ చేయిస్తోందనే వార్తలు దేశంలో ఇఫుడు సంచలనంగా మారింది. ఇదే విషయమై గడచిన నాలుగు రోజులుగా పార్లమెంటు అట్టుడికిపోతోంది. పార్లమెంటు లోపల, బయట ఇంత గోల జరుగుతున్న నరేంద్రమోడి మాత్రం నోరిప్పి ఏమీ మాట్లాడటంలేదు.

మోడి వైఖరితోనే ట్యాపింగ్ నిజమే అని జనాలు అనుకునేందుకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. మీడియాలో కథనాల ప్రకారం సుమారు లక్షమంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయట. ఇప్పటికి బయటపడిన పేర్లు 400 అయినా ఇంకా కొన్ని వేలమంది ట్యాపింగ్ బాధితులున్నట్లు ది వైర్ మీడియా వరసు కథనాలను ప్రచురిస్తోంది. రోజు రోజుకు బాధితుల పేర్లు బయటకువస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే తెలుగు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు చంద్రబాబునాయుడు ఫోన్ కూడా హ్యాకింగ్ అయ్యేఉంటుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకసారి ట్యాపింగ్ చేయించటం మొదలుపెడితే మిత్రులు లేరు ప్రత్యర్ధులూ ఉండరు. ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్న కారణంగానే ఎప్పటికిప్పుడు మోడి ప్రతిపక్షాల వ్యూహాలను తెలుసుకుంటున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి తాజా పెగాసస్ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 24, 2021 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago