దేశంలోని అత్యంత ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రప్రభుత్వం తెలుగు సీఎంల ఫోన్లను హ్యాకింగ్ చేయించకుండా ఉంటుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సంఘ విద్రోహుల కదలికలను తెలుసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించటం కొత్తేమీకాదు. పార్టీ అధికారంలో ఉన్నా చేసేదిదే. కాకపోతే ట్యాపింగ్ చేయిస్తున్న ఫోన్ల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
అయితే ఈ విషయంలో నరేంద్రమోడి సర్కార్ ఫెయిలయ్యింది. దేశంలోని ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, కార్పొరేట్ కంపెనీల ఛైర్మన్లతో పాటు అనేకమంది ఫోన్లను కేంద్రం ట్యాప్ చేయిస్తోందనే వార్తలు దేశంలో ఇఫుడు సంచలనంగా మారింది. ఇదే విషయమై గడచిన నాలుగు రోజులుగా పార్లమెంటు అట్టుడికిపోతోంది. పార్లమెంటు లోపల, బయట ఇంత గోల జరుగుతున్న నరేంద్రమోడి మాత్రం నోరిప్పి ఏమీ మాట్లాడటంలేదు.
మోడి వైఖరితోనే ట్యాపింగ్ నిజమే అని జనాలు అనుకునేందుకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. మీడియాలో కథనాల ప్రకారం సుమారు లక్షమంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయట. ఇప్పటికి బయటపడిన పేర్లు 400 అయినా ఇంకా కొన్ని వేలమంది ట్యాపింగ్ బాధితులున్నట్లు ది వైర్ మీడియా వరసు కథనాలను ప్రచురిస్తోంది. రోజు రోజుకు బాధితుల పేర్లు బయటకువస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే తెలుగు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు చంద్రబాబునాయుడు ఫోన్ కూడా హ్యాకింగ్ అయ్యేఉంటుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకసారి ట్యాపింగ్ చేయించటం మొదలుపెడితే మిత్రులు లేరు ప్రత్యర్ధులూ ఉండరు. ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్న కారణంగానే ఎప్పటికిప్పుడు మోడి ప్రతిపక్షాల వ్యూహాలను తెలుసుకుంటున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి తాజా పెగాసస్ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 24, 2021 2:34 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…