తెలంగాణ లో హుజురాబాద్ ఉప ఎన్నిక రోజు రోజుకీ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఉప ఎన్నిక ల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ తరపున ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ల తరపున అభ్యర్ధులు ఎవరన్న దానిపై మాత్రం సందిగ్థత కొనసాగుతోంది. ఈటలకు ధీటైన వ్యక్తిని హుజురాబాద్లో నిలబెట్టాల్సి వుంటుంది.
ఈ క్రమంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎన్నారై పాకాల శ్రీకాంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరును పరిశీలించి ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పాకాల శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామం వీణవంక మండలానికి ఆనుకుని ఉన్న అన్నారం గ్రామం. ఆయన స్థాపించిన సాఫ్ట్ వేర్ కంపెనీ సునేరా టెక్నాలజీ దేశవిదేశాల్లో పలువురికి ఉపాధి కల్పిస్తోంది. పాకాల శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీకాంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.
నిజమే... టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన షిసెడో…
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి…
దురంధర్ రాకముందు స్పై యాక్షన్ సినిమాలతో ఒకప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకున్నారు. ముఖ్యంగా…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద…
రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఇచ్చిన ఫ్యామిలీ దర్శకుడు…