మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు.. గులాబీ గూటికి చేరనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. అందుకే ఆయన ఇప్పుడు సడెన్ గా బీజేపీ ని వీడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ కి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఈ రోజు ఆ పార్టీకి వీడ్కోలు పలికారు.
పార్టీ వీడిన తర్వాత.. ఈటలపై అవినీతిపరుడంటూ విమర్శలు కూడా చేశారు. అయితే.. పార్టీ వీడటానికి ముందే.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల మీటింగ్ అటెండ్ అయ్యారు. పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్ కు వెళ్లటంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, దళిత బంధు సమావేశం కన్నా ముందు నుండే మోత్కుపల్లి టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. తాజాగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేయటంతో ఆయన టీఆర్ఎస్ లో చేరటం లాంఛనమేకానుంది. దళిత బంధు ప్రకటించిన రోజు నుండి… పలువురు దళిత నేతలను పార్టీలోకి చేర్చుకునేలా టీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది
This post was last modified on July 23, 2021 3:44 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…