మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు.. గులాబీ గూటికి చేరనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. అందుకే ఆయన ఇప్పుడు సడెన్ గా బీజేపీ ని వీడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ కి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఈ రోజు ఆ పార్టీకి వీడ్కోలు పలికారు.
పార్టీ వీడిన తర్వాత.. ఈటలపై అవినీతిపరుడంటూ విమర్శలు కూడా చేశారు. అయితే.. పార్టీ వీడటానికి ముందే.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల మీటింగ్ అటెండ్ అయ్యారు. పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్ కు వెళ్లటంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, దళిత బంధు సమావేశం కన్నా ముందు నుండే మోత్కుపల్లి టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. తాజాగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేయటంతో ఆయన టీఆర్ఎస్ లో చేరటం లాంఛనమేకానుంది. దళిత బంధు ప్రకటించిన రోజు నుండి… పలువురు దళిత నేతలను పార్టీలోకి చేర్చుకునేలా టీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది
This post was last modified on July 23, 2021 3:44 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…