ఎన్నికలు వస్తున్నాయంటేనే రాజకీయ పార్టీలు పూనకం వచ్చినట్లు హామీలవర్షం కురిపించేస్తుంటారు. నోటికేదొస్తే ఆ హామీనిచ్చేసి పబ్బం గడుపుకోవచ్చని అనుకునే పార్టీల అధినేతలే ఎక్కువమంది. అధినేతలిచ్చిన హామీలను జనాలు నమ్మి ఓట్లేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలు అమలవుతాయి, మరికొన్నింటిని నీరుగార్చేస్తారు. అసలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కన పడేసే సందర్భాలు కూడా ఉంటాయి. హామీల అమలు విషయంలో ఇకనుండి అలా ఉండేందుకు లేదు.
తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ అమలు కాకపోవటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల ఇంటి అద్దెలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇచ్చిన హామీ అమలు కాలేదు. దనిపై కొందరు కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇచ్చిన హామీని అమల్లోకి తేవాల్సిన బాధ్యత సీఎంపైనే ఉంటుందని స్పష్టంగా చెప్పింది.
అధికారంలోకి రావటానికి లేదా వచ్చిన తర్వాత సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సీఎంపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంగా తేల్చిచెప్పింది. ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు స్వాగతించాల్సిందే. ఎందుకంటే అధికారంలోకి రావటమే టార్గెట్ గా పార్టీల అధినేతలు ఆచరణ సాధ్యంకాని హామీలను ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
రాష్ట్ర ఆర్ధికపరిస్ధితులతో సంబంధం లేకుండా ఉచిత హామీలు, రాష్ట్రపరిధిలో లేని రిజర్వేషన్ల అమలు లాంటి హామీలను ఇచ్చేస్తున్న విషయం జనాలు చూసిందే. ఏపిలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణాలో కేసీయార్, తమిళనాడులో పార్టీలు ఇలాంటి ఎన్నో హమీలను ఇచ్చేశారు. జనాలు కూడా ఇలాంటి ఉచిత ప్రకటనలకు అలవాటుపడిపోయారు.
ఇలాంటి ఉదాహరణలనే ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. తమ తీర్పు ఢిల్లీకి మాత్రమే వర్తించదని ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని స్పష్టంగా చెప్పింది. మరి మన నేతలు హామీలను ఇచ్చేముందు ఇకనుండి జాగ్రత్తగా ఉంటారా ?
This post was last modified on July 23, 2021 4:22 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…