తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోంది. ఈటల రాజీనామాతో ఈ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ని ఓడించేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికే లక్ష్యంగా.. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. హుజురాబాద్ టికెట్.. తనకే కేటాయిస్తారనుకొని టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ప్రస్తుతం డైలమాలో పడిపోయారట. ఆయనకు టికెట్ ఇచ్చే ఉద్దేశం కేసీఆర్ లో లేనట్లు తెలుస్తోంది.
అందుకు.. ఆయన చెప్పిన మాటలే బలాన్ని ఇస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ తరఫున పోటీ ఇస్తాడనుకున్న కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ టికెట్ ఆశ చూపి కేసీఆర్ తన పార్టీలోకి తీసుకున్నాడనే ప్రచారం మొదటి నుంచి వినిపిస్తోంది. కాగా ఆయన కాల్ వాయిస్లు లీక్ అయినప్పటి నుంచే ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అనుకున్నట్టు గానే ఆయన నిన్న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఏకంగా కేసీఆరే రావడంతో టికెట్ ఖాయమే అని అంతా ఊహించారు. కానీ ఇక్కడే కేసీఆర్ ట్విస్టు ఇచ్చారు. కౌశిక్ చేరిక సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పదువులు శాశ్వతం కాదని, పార్టీలో ఉంటే అదే పెద్ద పవర్ అని, ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించాలంటూ మాట్లాడటంతో అసలు టికెట్ ఖాయంగా లేదని కౌశిక్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో కౌశిక్ కూడా డైలమాలో పడ్డాడని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on July 23, 2021 12:16 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…