Political News

షాక్ ఇచ్చిన మంత్రి: బాగా పనిచేస్తున్నా అమ్మేస్తారట

లోక్ సభలో కేంద్ర ఉక్కశాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. ఉక్కు పరిశ్రమల అమ్మకంపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తు దేశంలోని అన్నీ పరిశ్రమల్లో ప్రైవేటు సంస్ధలకన్నా ప్రభుత్వ రంగ సంస్ధలే బాగా పనిచేస్తున్నట్లు అంగీకరించారు. దేశవ్యాప్తంగా 869 ప్రైవేటు ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 పరిశ్రమలున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాది అన్నీ ప్రైవేటు పరిశ్రమల ఉత్పత్తి టార్గెట్ 11.79 కోట్ల టన్నుల సామర్ధ్యంలో 8.4 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసినట్లు మంత్ర తెలిపారు.

ఇదే సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశ్రమలు 2.59 కోట్ల టన్నుల సామర్ధ్యంలో 1.95 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసినట్లు మంత్రి తెలిపారు. పనిలో పనిగా వైజాగ్ ఉక్కు పరిశ్రమ పనితీరు కూడా బాగున్నట్లు మంత్రి కమిట్ అయ్యారు. విచిత్రమేమిటంటే ప్రభుత్వరంగంలోని 9 ఉక్కు పరిశ్రమల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచింది విశాఖ ఉక్కేనట. 2020-21 సంవత్సరంలో విశాఖ ఉక్కు టార్గెట్ 63 లక్షల టన్నులకు గాను 43.02 లక్షల టన్నులను ఉత్పత్తి చేసిందని మంత్రి అంగీకరిచాంరు.

మరి ఇంతమంచి పనితీరును కనబరుస్తున్న విశాఖ ఉక్కును ఎందుకు ప్రైవేటుపరం చేయాలని నరేంద్రమోడి సర్కార్ డిసైడ్ చేసిందో ఎవరికీ అర్ధంకావటంలేదు. విశాఖ ఉక్కు మినహా మిగిలిన ఎనిమిది సంస్ధలకు ఇనుపఖనిజాలు సొంతానికి ఉన్నాయి. ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమే ఇనుప ఖనిజాన్ని బయటనుండి కొంటోంది. ఇనుపఖనిజాన్ని బయట నుండి కొంటున్నా ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలను సాధిస్తోందన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.

ఇదేగనుక ఇతర పరిశ్రమలకు ఉన్నట్లే విశాఖ ఉక్కుకు కూడా సొంత గనులుంటే బయటనుండి ఖనిజాన్ని కొనాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఉత్పత్తి వ్యయం మరింత తగ్గటం వల్ల లాభాలు మరింతగా పెరుగుతాయి. దశాబ్దాల తరబడి వైజాగ్ స్టీల్స్ కు సొంతగనులను కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం అడుగుతున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. పూర్తిగా విశాఖ ఉక్కు మీద నిర్లక్ష్యం చూపటమే కాకుండా మంచి ఫలితాలు చూపిస్తున్న ఫ్యాక్టరీని అమ్మేయాలని డిసైడ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on July 20, 2021 4:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

48 minutes ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

2 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

4 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

5 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

5 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

6 hours ago