దేశం ఏదైనా కానీ రాజకీయం మాత్రం ఒక్కటే. అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీలు పని చేస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలోకి విదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించే కన్నా.. దేశంలోని వారికే ఎక్కువగా ఛాన్సులు ఉండాలన్న వాదన బలపడుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్ 1బీ.. ఎల్ 1 వీసా జారీ విధానంలో మార్పులు కోరుతూ తాజాగా ఒక బిల్లును చట్టసభల్లోకి తీసుకొచ్చారు.
అమెరికాలోని అధికార.. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు ‘‘ది హెచ్ 1బీ అండ్ ఎల్ 1 వీసా రిఫార్మ్ యాక్ట్’’ పేరుతో ఈ బిల్లును తయారు చేశారు. దాన్ని చట్టసభల్లో ప్రవేశ పెట్టారు. అంచనాలకు తగ్గట్లే ఈ బిల్లులో అమెరికాలో నివసిస్తున్న అమెరికన్లకు పెద్దపీట వేసేలా.. వారికి మరింత ప్రయోజనం కలిగించేలా ఈ బిల్లును ప్రతిసాదిస్తున్నారు.
అయితే.. కొంతలో కొంత మేలు చేసే అంశం ఏమంటే.. అమెరికాలో చదువుకున్న చురుకైన విద్యార్థులకు హెచ్ 1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
బిల్లులోని కీలకాంశాల్ని చూస్తే..
— అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్ 1బీ.. ఎల్ 1 వీసాదారులకు భర్తీ చేయటాన్ని పూర్తిగా నిషేధించాలి.
— వీసాదారులతో ఇతర అమెరికా ఉద్యోగులు.. కార్మికుల పనితీరు.. పని ప్రదేశంతో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలి.
— తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్1బీ.. ఎల్1 ఉద్యోగులను దిగుమతి చేసుకొని తిరిగి వారిని సొంతదేశానికి పంపే ఔట్ సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలి
— 50 కంటే ఎక్కువమంది పని చేస్తూ వారిలో సగం కంటే ఎక్కువమంది హెచ్ 1బీ.. ఎల్ 1 వీసాదారులు ఉంటే.. మరింతమంది హెచ్ 1బీ వీసాదారుల్ని నియమించుకోవటాన్ని నిషేధించాలి
— ఉద్యోగ నియమకాలు.. వీసా రూల్స్ ను పక్కాగా పాటించేలా చూడటం కోసం లేబర్ డిపార్ట్ మెంట్ కు మరిన్ని అధికారాలు కట్టబెట్టటం
— నిబంధనల్ని ఉల్లంఘిస్తే లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులకు శిక్షల విధించే అధికారం కట్టబెట్టటం
This post was last modified on May 28, 2020 9:10 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…