తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారా..? ఆయన ఇంటి వద్ద ఉన్న పోలీసు బలగాలను చూస్తుంటే.. అదే నిజమని ఎవరికైనా అర్థమౌతుంది. కాగా.. ఇప్పుడు ఆయనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఢిల్లీ పర్యటనను అడ్డుకునేందుకే ఈ హౌస్ అరెస్టు చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే… తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే వేలం వేసిన కోకాపేట భూముల వేలంలో భారీ అవినీతి జరిగిందని, కేసీఆర్- కంపెనీలు కుమ్మక్కై 1000కోట్లు ప్రభుత్వానికి నష్టం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 60కోట్లకు పైగా ఎకరం పలకాల్సిన భూమిని కేవలం 30కోట్ల పైచిలుకు రేట్లకే అమ్మేశారని… పారదర్శకత లేదని రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందు డ్యాక్యుమెంట్స్ ఇచ్చారు. అంతే కాదు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లి, అక్కడే హోంమంత్రి అమిత్ షాకు, ప్రధానికి ఫిర్యాదు చేస్తానని… విచారణకు ఆదేశించాలని కోరుతానని హెచ్చరించారు.
ఇంటలిజెన్స్ ప్రభాకర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ ల అవినీతి అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తానని చెప్పిన రెండ్రోజులకే రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసు బలగాలు మొహరించారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ పోలీసులు వచ్చారని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
This post was last modified on July 19, 2021 10:52 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…