తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారా..? ఆయన ఇంటి వద్ద ఉన్న పోలీసు బలగాలను చూస్తుంటే.. అదే నిజమని ఎవరికైనా అర్థమౌతుంది. కాగా.. ఇప్పుడు ఆయనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఢిల్లీ పర్యటనను అడ్డుకునేందుకే ఈ హౌస్ అరెస్టు చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే… తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే వేలం వేసిన కోకాపేట భూముల వేలంలో భారీ అవినీతి జరిగిందని, కేసీఆర్- కంపెనీలు కుమ్మక్కై 1000కోట్లు ప్రభుత్వానికి నష్టం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 60కోట్లకు పైగా ఎకరం పలకాల్సిన భూమిని కేవలం 30కోట్ల పైచిలుకు రేట్లకే అమ్మేశారని… పారదర్శకత లేదని రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందు డ్యాక్యుమెంట్స్ ఇచ్చారు. అంతే కాదు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లి, అక్కడే హోంమంత్రి అమిత్ షాకు, ప్రధానికి ఫిర్యాదు చేస్తానని… విచారణకు ఆదేశించాలని కోరుతానని హెచ్చరించారు.
ఇంటలిజెన్స్ ప్రభాకర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ ల అవినీతి అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తానని చెప్పిన రెండ్రోజులకే రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసు బలగాలు మొహరించారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ పోలీసులు వచ్చారని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
This post was last modified on July 19, 2021 10:52 am
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…