Political News

ఏపీ అడిగినట్లే 2 టీఎంసీలు ఇచ్చేందుకు తెలంగాణ ఓకే

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోతిరెడ్డిపాడుకు అనుబంధంగా నిర్మించాలని భావిస్తున్న ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. విపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కేసీఆర్ మొదలు విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటివేళలో.. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి 2 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఇవ్వాలని ఏపీ కోరటం ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య జల పంచాయితీ జరుగుతున్న వేళ.. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ముందుకు వెళ్లవు. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువకు మే చివరి వరకూ 2 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఏపీ భావించింది. ఈ విషయాన్ని తెలంగాణ సర్కారుకు తెలియజేసింది. అయితే.. ఇప్పటికే ఏపీకి కేటాయించిన వాటాను పూర్తిగా వాడేశారన్నది తెలంగాణ సర్కారు వాదన. దీనిపై ఏపీ వాదన మరోలా ఉంది.

దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక అధికారులు క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరయ్యారు. కేటాయించిన వాటాకు మించి ఏపీ నీటిని ఖర్చు చేసినట్లుగా తెలంగాణ అధికారులు ఆరోపిస్తే.. అందులో నిజం లేదని ఏపీ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ అధికారులు వినిపించిన వాదనలతో తెలంగాణ అధికారులు మౌనం వహించినట్లుగా చెబుతున్నారు.

వరద జలాల వినియోగంపై తెలంగాణ అధికారుల వాదనకు ఏపీ అధికారులు బలమైన కౌంటర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అసలు వరద జలాలకు లెక్కలు ఏమిటి? వరద జలాల్ని వాటాల కింద ఎలా లెక్కిస్తారు? వరద జలాలపై దిగువ రాష్ట్రాలకు హక్కు ఉంటుందన్న వాదనను ఏపీ అధికారులు వినిపించినట్లుగా సమాచారం. అంతేకాదు.. తెలంగాణ వినియోగించిన నీటి లెక్కల్ని చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో.. తాగునీటి అవసరాలు కావటం.. ఏపీ అధికారులు వినిపించిన వాదనల్లో పస ఉండటంతో తెలంగాణ అధికారులు సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. 2 టీఎంసీల నీటిని ఏపీ వినియోగించేందుకు వీలుగా సానుకూల నిర్ణయం వెలువడినట్లు చెబుతున్నారు. మొత్తంగా వివాదం వేళలోనూ సమర్థమైన వాదనను వినిపించటం ద్వారా తమ అవసరాలను తీర్చుకునేలా నీటి వినియోగానికి అనుమతిని సాధించుకోగలిగినట్లుగా తెలుస్తోంది.

This post was last modified on May 23, 2020 2:21 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

12 mins ago

`పెద్దిరెడ్డి` నియోజ‌క‌వ‌ర్గం ఇంత డేంజ‌రా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అంటే..అసెంబ్లీ+పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని…

18 mins ago

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

2 hours ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

2 hours ago

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు…

3 hours ago

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…

4 hours ago