తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తన ఉనికిని చాటుకుంది. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మల్కాజ్గిరి నుంచి పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపి మల్లారెడ్డి కూడా పార్టీ మారిపోయారు. చివరకు 2018 ముందస్తు ఎన్నికలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాత్రమే పార్టీకి మిగిలారు.
ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరిపోయారు. కాస్తోకూస్తో పార్టీకి పడుతుందని చెప్పుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ పార్టీ పూర్తిగా దిగజారిపోయింది. ఇక తెలంగాణలో టిడిపికి ఎన్ని జాకీలు వేసినా పుంజుకోదని డిసైడ్ అయిన ఆ పార్టీ తాజా మాజీ అధ్యక్షులు ఎల్.రమణ సైతం కారెక్కేశారు. ఇటీవల రమణ పార్టీని వీడడంతో టిడిపి నేతలు అంతా జారుకుంటున్నారు.
తెలంగాణలో పార్టీ మరి చుక్కాని లేని నావ మాదిరిగా మారడంతో… చంద్రబాబు సైతం పార్టీకి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా విగ్రహం మాదిరిగా ఒక అధ్యక్షుని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుకు టీటీడీపీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఎంపికను అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ
అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కూడా కసరత్తులు జరుగుతున్నాయి. బీసీ నేతగా ఉన్న రమణ పార్టీని వీడడంతో చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ల నేపథ్యంలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డికే టీటీడీపీ పగ్గాలు ఇవ్వాలని అనుకున్నారు.
చంద్రశేఖర్ రెడ్డిపై పార్టీ పగ్గాలు స్వీకరించాలని తీవ్రంగా ఒత్తిడి చేశారట. అయితే వ్యక్తిగత కారణాలతో టీటీడీపీ అధ్యక్షుడి పదవిని స్వీకరించడానికి రావుల చంద్రశేఖరరెడ్డి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బీసీ నేత అయిన అరవింద్ కుమార్ గౌడ్ పేరు కూడా ప్రముఖంగా పరిశీలనకు వచ్చింది. చివరకు బక్కని నర్సింహులు వైపు పార్టీ నాయకత్వం మొగ్గుచూపినట్లు సమాచారం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అంత ఫేమ్ లేని నర్సింహులు టీటీడీపీని ఏ తీరాలకు చేరుస్తారో ? చూడాలి.
This post was last modified on July 18, 2021 7:47 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…