Political News

శ్మ‌శానాన్నీ అమ్మేయాల‌నుకున్న కేసీఆర్‌.. కానీ.. బిగ్ బ్రేక్‌!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని కేసీఆర్‌ ప్ర‌భుత్వం ఆర్థిక క‌ష్టాల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ భూముల‌ను వేలానికి పెట్టింది. కోకాపేట్‌లో ప్రారంభ‌మైన ఈ భూములమ్మే ప్ర‌క్రియ‌.. ఖానామెట్‌వ‌ర‌కు పెరిగింది. కోకా పేట‌లో కోట్ల రూపాయలు పలికిన ప్రభుత్వ భూముల ధరలు.. ఖానామెట్‌లోనూ అదే పరంపరను కొనసాగించాయి. ‘ఇ-ఆక్షన్‌’లో ఎకరానికి అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. కోకాపేటలో ఎకరానికి అత్యధికంగా రూ.60.20 కోట్లు రాగా.. ఇక్కడ రూ.5 కోట్లు తగ్గాయి. ఖానామెట్‌లో 14.91 ఎకరాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.729.41 కోట్ల సొమ్మును ఆర్జించింది.

ఆదాయ వనరులను సమీకరించుకోవడంలో భాగంగా ప్రభుత్వం భూములను అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో కోకాపేట, ఖానామెట్‌లలోని భూములను అమ్మాలని నిర్ణయించింది. కోకాపేటలో 49.94 ఎకరాల భూమిని విక్రయించగా.. రూ.2000.37 కోట్లు వచ్చాయి. ఖానామెట్‌లోని టీఎ్‌సఐఐసీకు చెందిన 14.91 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. మొత్తానికి.. సగటున ఎకరానికి రూ.48.92 కోట్ల మేర ధర పలికింది. 2.92 ఎకరాలతో కూడిన 14వ నెంబరు ప్లాట్‌కు అత్యధికంగా ఎకరానికి రూ.55 కోట్ల ధర లభించింది.

కోకాపేటలో హెచ్ఎండీఏ వేలం పాటలో రికార్డు ధర దక్కించుకున్నప్ప‌టికీ.. ఇక్క‌డి భూ బాధితులు స‌ద‌రు భూముల చుట్టూ ఉన్న తమ నివాసాల కోసం చేస్తున్న ఆందోళన చేప‌ట్టారు. ఇప్పటి వరకు ఖానాపూర్‌ వాసులు ఆందోళన చేస్తుండగా ఇప్పుడు కోకాపేట సబితానగర్‌ వాసులు వారికి తోడయ్యారు. హెచ్ఎండీఏ వేలం వేసిన భూములలో తమకు ఇచ్చిన పట్టాలకు పొజిషన్‌ ఇవ్వాలంటూ ఖానాపూర్‌ వాసులు న్యాయపోరాటం, ధర్నాలు చేశారు. మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఇదిలావుంటే, ఈ భూముల వేలం ప్ర‌క్రియ‌లో భాగంగా ప్ర‌భుత్వం ఏకంగా శ్మ‌శాన స్థ‌లాల‌ను కూడా వేలం వేసేందుకు సిద్ధ‌మైంది. అయితే.. ఇప్పుడు దీనికి పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల శ్మ‌శానం ఉంది. ఆ శ్మ‌శాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో ఈ వేలాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్‌గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం, కేసీఆర్ స‌హా మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on July 17, 2021 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

50 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

58 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago