ఉమ్మడి ప్రత్యర్ధిని ఎదుర్కొనేందుకు ఇద్దరు ఏకమవుతున్నారా ? ఢిల్లీ కేంద్రంగా మొదలైన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నరేంద్రమోడిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు బద్ధ శతృవులైన కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ చేతులు కలుపుతున్నట్లే ఉన్నాయి. ఈనెల 25వ తేదీన సోనియాగాంధీ-మమత భేటీ జరగబోతోందని సమాచారం.
19వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో ఎన్డీయేని ఇరుకునపెట్టడానికి తృణమూల్ ఎంపీలు రెడీ అవుతున్నారు. 25వ తేదీన మమత ఢిల్లీకి చేరుకుంటారని సమాచారం. వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తృణమూల్ పోషించాల్సిన పాత్రపై వివిధ పార్టీల అధినేతలతో చర్చించనున్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు చాలామంది ప్రతిపక్షాలకు చెందిన అధినేతలతో భేటీ అవటానికి మమత ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటగా సోనియా గాంధీ+రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నారు. ప్రతిపక్షాల్లో చాలామందికి నరేంద్ర మోడియే ప్రధానమైన టార్గెట్. కాబట్టి మమత కూడా మోడికి వ్యతిరేకంగా బాగా యాక్టివ్ అయిపోయారు.
సో మోడిపై ప్రతిపక్షాల్లో ఉన్న వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉంది ? మోడికి వ్యతిరేకంగా ఎంతమంది ఏకతాటిపైకి వస్తారు ? అనే విషయం తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది. ఇందుకు ఒకవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మరోవైపు మమత బెనర్జీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లున్నారు. చూద్దాం దేశ రాజకీయాలు తొందరలో చాలా హాటుగా హాటుగా మారిపోతాయేమో.
This post was last modified on July 16, 2021 3:02 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…