Political News

మోడికి వ్యతిరేకంగా మమత మొదటి స్టెప్ ?

ఉమ్మడి ప్రత్యర్ధిని ఎదుర్కొనేందుకు ఇద్దరు ఏకమవుతున్నారా ? ఢిల్లీ కేంద్రంగా మొదలైన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నరేంద్రమోడిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు బద్ధ శతృవులైన కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ చేతులు కలుపుతున్నట్లే ఉన్నాయి. ఈనెల 25వ తేదీన సోనియాగాంధీ-మమత భేటీ జరగబోతోందని సమాచారం.

19వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో ఎన్డీయేని ఇరుకునపెట్టడానికి తృణమూల్ ఎంపీలు రెడీ అవుతున్నారు. 25వ తేదీన మమత ఢిల్లీకి చేరుకుంటారని సమాచారం. వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తృణమూల్ పోషించాల్సిన పాత్రపై వివిధ పార్టీల అధినేతలతో చర్చించనున్నారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు చాలామంది ప్రతిపక్షాలకు చెందిన అధినేతలతో భేటీ అవటానికి మమత ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటగా సోనియా గాంధీ+రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నారు. ప్రతిపక్షాల్లో చాలామందికి నరేంద్ర మోడియే ప్రధానమైన టార్గెట్. కాబట్టి మమత కూడా మోడికి వ్యతిరేకంగా బాగా యాక్టివ్ అయిపోయారు.

సో మోడిపై ప్రతిపక్షాల్లో ఉన్న వ్యతిరేకత ఏ స్ధాయిలో ఉంది ? మోడికి వ్యతిరేకంగా ఎంతమంది ఏకతాటిపైకి వస్తారు ? అనే విషయం తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది. ఇందుకు ఒకవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మరోవైపు మమత బెనర్జీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లున్నారు. చూద్దాం దేశ రాజకీయాలు తొందరలో చాలా హాటుగా హాటుగా మారిపోతాయేమో.

This post was last modified on July 16, 2021 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

43 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

52 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago