తొందరలోనే జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగటం ఖాయమనే అనిపిస్తోంది. అయితే ఈ డేంజర్ బెల్స్ మోగించేది మామూలు జనాలు కాదు ఉద్యోగులే అనే ప్రచారం పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూసే పీఆర్సీ గురించి ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. దీనికి అదనంగా బకాయిలున్న డీఏల విషయంలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం.
నిజానికి ఉద్యోగులకు రెండు బకాయిలను 2018 లోనే పీఆర్సీ వేయాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే. అయితే అప్పట్లో చంద్రబాబు ఆపని చేయలేదు. దాంతో ఆ రెండు జగన్ ప్రభుత్వానికి క్యారీ ఫార్వార్డ్ అయ్యింది. దీనికి అదనంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు+కొత్త డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే పీఆర్సీ కూడా ప్రకటించాలి. పనిలో పనిగా సీపీఎస్ రద్దు విధానంపైన కూడా ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు.
ఉద్యోగులకు ఎప్పుడు కూడా తమకు రావాల్సిన దానిపైనే దృష్టుంటుంది. అందాల్సినది అందకపోయేసరికి అసంతృప్తి పెరిగిపోతుంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది. ఇదే సమయంలో డీఏలకు చెల్లించాల్సిన సుమారు రు. 12 వేల కోట్లు పెండింగ్ లో పెట్టింది.
ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నది మళ్ళీ ఉద్యోగులే. అంటే తమ చేతుల మీదగానే వేల కోట్ల రూపాయలను పంపిణీ చేస్తన్న ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్ధికప్రయోజనాలను మాత్రం రాబట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నిధులను ఎక్కడినుండి తీసుకొస్తుందనేది ఉద్యోగులకు అవసరంలేదు.
తమ ప్రయోజనాలను రాబట్టుకోలేకపోతే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతుంది. కరోనా వైరస్ వచ్చిందా ? లేకపోతే తుపానులు వచ్చాయా అన్నది ఉద్యోగులకు అనవసరం. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగుల డీఏలను కేంద్రం వాయిదా వేసింది. అయితే డీఏని 11 శాతం పెంచి వెంటనే అమల్లోకి తెచ్చింది. మరి జగన్ ఏమి చేస్తాడనేది ఉద్యోగులు గమనిస్తున్నారు. ఏదో రోజు డీఏలు+పీఆర్సీల బాంబు పేలేట్లుగానే ఉంది. కాబట్టే జగన్ కు డేంజర్ బెల్స్ తప్పేట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on July 16, 2021 11:25 am
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…