హుజూరాబాద్ ఉపఎన్నికల విషయంలో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కసారిగా జోరుపెంచారు. ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పార్టీ తరపున ఇన్చార్జిలను నియమించారు. ఇదే సందర్భంలో తాను కూడా తొందరలోనే నియోజకవర్గంలో క్యాంపు వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 12 మందిని ఇన్చార్జీలుగా నియమించారు.
అలాగే ఓవరాల్ గా నియోజవర్గం బాధ్యతలు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు అప్పగించారు. ఇదే సమయంలో సమన్వయకర్తలుగా మాజీమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తో పాటు మరో మాజీమంత్రి జీవన్ రెడ్డిని కూడా నియమించారు. జీవన్ ప్రస్తుతం రేవంత్ మీద అలిగిన విషయం తెలిసిందే. ఎందుకంటే రేవంత్ తో పాటు జీవన్ రెడ్డి కూడా పార్టీ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
ఇక విషయానికి వస్తే మండలాల ఇన్చార్జిలు ఉపఎన్నిక అయ్యేవరకు స్ధానిక నేతలతోనే టచ్ లో ఉండాలని గట్టిగా చెప్పారు. తమకు కేటాయించిన మండలాల్లో నేతలంతా పర్యటించి పార్టీ నేతలను, శ్రేణులతో సమావేశమవ్వాలని ఆదేశించారు.
సరే ఇన్చార్జీలను బీజేపీ, టీఆర్ఎస్ ఎప్పుడో నియమించేశాయి. కాకపోతే అప్పట్లో లేని జోష్ రేవంత్ నియామకంతో కాంగ్రెస్ లో కనబడుతోంది. చివరకు అందరు కలిసి ఏమి చేస్తారో చూడాలి.
This post was last modified on July 15, 2021 1:16 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…