Political News

తెలంగాణాకు జగన్ ఫిట్టింగ్

జల జగడాల పరిష్కారం విషయలో తెలంగాణా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కరెక్టు ఫిట్టింగ్ పెట్టారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలపై ఏపి ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలను వ్యక్తంచేసినా ఉపయోగం కనబడలేదు. పైగా శ్రీశైలం డ్యాం, పులిచింతల ప్రాజెక్టుల్లో నుండి నీటి నిల్వ సామర్ధ్యంతో సంబంధంలేకుండానే విద్యుత్ ఉత్పత్తి చేసేసింది. ఈ విషయమై జగన్ ఎంత చెప్పినా కేసీయార్ ఏమాత్రం లెక్కచేయలేదు.

దాంతో తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి ఉపయోగం లేదని గ్రహించిన జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖలు రాశారు. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం నుండి కూడా పెద్దగా స్పందన కనబడలేదు. ఇదే సమయంలో నీటికేటాయింపుల్లో బచావత్ ట్రైబ్యునల్ చెప్పిన 299 టీఎంసీలు కాకుండా తమకు 400 టీఎంసీలు కావాలంటు కేసీయార్ పేచీకి దిగారు. దాంతో ఇక లాభం లేదనుకుని జల జగడాలపై ఏపి ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసింది.

జగన్ అభ్యంతరాలను తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోకపోయినా, జగన్ లేఖలకు కేంద్రం స్పందించకపోయినా పర్వాలేదు. కానీ సుప్రింకోర్టు ఇచ్చే నోటీసులకు ఇటు తెలంగాణా ప్రభుత్వం అటు కేంద్రం రెస్పాండై తీరాలి. సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే జరగబోయేదేంటో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే కేసు విషయాన్ని జగన్ ప్రకటించగానే వెంటనే జల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణా ప్రభుత్వం నిలిపేసింది.

కోర్టుల్లో వ్యవహారమంటే తొందరగా తేలేది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా ప్రాజెక్టుల నిర్వహణను రాష్ట్రాల పరిధిలోనుండి తప్పించి కేంద్రం పరిధిలోకి చేర్చమని ఏపి ప్రభుత్వం తన పిటీషన్లో కోరింది. ఏపికి ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా ప్రభుత్వం చేసిన నష్టాన్ని ఆధారాలతో సహా వివరించింది. ప్రాజెక్టుల నిర్వహణ తెలంగాణా చేతిలో ఉన్నంతవరకు ఏపికి అన్యాయం జరుగుతునే ఉంటుందని స్పష్టంగా చెప్పింది.

తెలంగాణా వల్ల ఏపికి జరుగుతున్న నష్టాన్ని కేంద్రానికి చెప్పినా పట్టించుకోలేదన్న విషయాన్ని ఏపి సర్కార్ తన పిటీషన్లో స్పష్టంగా చెప్పింది. కేంద్రానికి రాసిన లేఖలను కూడా జతచేసింది. నీటి కేటాయింపుల్లో బ్రజేష్ ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా కేసీయార్ మాట్లాడిన మీడియా క్లిప్పుంగులను కూడా జతచేసింది. ఏపి పిటీషన్ నేపధ్యంలో తెలంగాణా, కేంద్రప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే.

Satya

Recent Posts

విజయ్ అడుగుజాడల్లో జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు…

2 hours ago

మహావీరుడి కథను ఆదిత్య ధార్ తీస్తారా

దురంధర్ ముందు వరకు నాన్ బాలీవుడ్ రాష్ట్రాల్లో అంతగా పరిచయం లేని పేరు ఆదిత్య ధార్. ఏడు గంటలకు పైగా…

4 hours ago

పెద్ద చేయి అందుకున్న నైజామ్ ప్యారడైజ్

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…

12 hours ago

అభిమానం స‌రే… ప‌వ‌న్‌ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్‌!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు ప‌రామ‌ర్శ‌లు వెల్లువ‌లా త‌ర‌లి వ‌స్తున్నాయి. ఏపీ స‌హా తెలంగాణ…

12 hours ago

జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ…

14 hours ago

తమన్నా నుంచి బోల్డ్ ట్రీట్

బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…

14 hours ago