ఎలాగైనా తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నాయకత్వం పట్టు. ఇదే సమయంలో తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకోవాలని తిరుగుబాటు ఎంపి ప్రయత్నాలు. రెండువైపుల ఒకేసారి జరుగుతున్న ప్రయత్నాలకు తొందరలోనే ముగింపు పడే అవకాశం ఉందని అనిపిస్తోంది. రెండు వైపుల నుండి జరుగుతున్న పరిణామాలు కూడా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై బాగా ఒత్తిడిని పెంచేస్తోంది.
తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అనర్హత వేటు విషయంలో రాబోయే సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అర్ధమైపోతోంది. అనర్హత వేటు విషయంలో తాను నిబంధనలను ప్రకారమే నడుచుకుంటానని స్పష్టంచేశారు. రెండు పార్టీలతోను భేటీ అయి వాళ్ళ వాదనలు వింటానని స్పీకర్ చెప్పటం చూస్తుంటే ఆ భేటీ ఏదో తొందరలోనే జరిగేట్లే ఉంది.
నిజానికి ఓ సభ్యుడిపై అనర్హత వేటు అన్నది విప్ జారీని ఉల్లంఘించినపుడు మాత్రమే తీసుకుంటారా ? లేకపోతే పార్టీ నియమావళిని ఉల్లంఘించినపుడు కూడా అనర్హత వేటు వేయచ్చా ? అనేది అయోమయంగా మారింది. తిరుగుబాటు ఎంపి విప్ ఉల్లంఘించినట్లు ఎక్కడా కనబడటంలేదు.
అయితే పార్టీ నియమావళిని ఉల్లంఘించారనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ పాయింట్ లోనే పార్టీ నాయకత్వం రఘురామపై అనర్హత వేటుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అనర్హత వేటు విషయంలో వైసీపీకి ఉన్న తొందర స్పీకర్ కు ఎందుకుంటుంది ? అందుకనే ఏదో కారణం చెప్పి విషయాన్ని స్పీకర్ బాగా సా…..గదీస్తున్నారు. అందుకనే వైసీపీ కూడా ఒత్తిడి పెంచేసింది. అందుకనే ఇఫుడు పిటీషన్ వ్యవహారం క్లైమ్యాక్సికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.
రఘురామరాజుపై వేటు వేయడం లేదన్న ఒత్తిడిలో ఇటీవలే విజయసాయిరెడ్డి ఏకంగా స్పీకర్ పై విమర్శలు చేశారు. గతంలో పొరపాటున రాజ్యసభలో నోరు జారి తరువాత నాలిక్కరుచుకుని సారీ చెప్పి విజయసాయి విమర్శలు ఆశ్చర్యకరం. దీనిపై తాజాగా రఘురామరాజు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి సంచలనం సృస్టించారు. చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on July 14, 2021 9:44 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…