ఎలాగైనా తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నాయకత్వం పట్టు. ఇదే సమయంలో తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకోవాలని తిరుగుబాటు ఎంపి ప్రయత్నాలు. రెండువైపుల ఒకేసారి జరుగుతున్న ప్రయత్నాలకు తొందరలోనే ముగింపు పడే అవకాశం ఉందని అనిపిస్తోంది. రెండు వైపుల నుండి జరుగుతున్న పరిణామాలు కూడా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై బాగా ఒత్తిడిని పెంచేస్తోంది.
తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అనర్హత వేటు విషయంలో రాబోయే సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అర్ధమైపోతోంది. అనర్హత వేటు విషయంలో తాను నిబంధనలను ప్రకారమే నడుచుకుంటానని స్పష్టంచేశారు. రెండు పార్టీలతోను భేటీ అయి వాళ్ళ వాదనలు వింటానని స్పీకర్ చెప్పటం చూస్తుంటే ఆ భేటీ ఏదో తొందరలోనే జరిగేట్లే ఉంది.
నిజానికి ఓ సభ్యుడిపై అనర్హత వేటు అన్నది విప్ జారీని ఉల్లంఘించినపుడు మాత్రమే తీసుకుంటారా ? లేకపోతే పార్టీ నియమావళిని ఉల్లంఘించినపుడు కూడా అనర్హత వేటు వేయచ్చా ? అనేది అయోమయంగా మారింది. తిరుగుబాటు ఎంపి విప్ ఉల్లంఘించినట్లు ఎక్కడా కనబడటంలేదు.
అయితే పార్టీ నియమావళిని ఉల్లంఘించారనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ పాయింట్ లోనే పార్టీ నాయకత్వం రఘురామపై అనర్హత వేటుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అనర్హత వేటు విషయంలో వైసీపీకి ఉన్న తొందర స్పీకర్ కు ఎందుకుంటుంది ? అందుకనే ఏదో కారణం చెప్పి విషయాన్ని స్పీకర్ బాగా సా…..గదీస్తున్నారు. అందుకనే వైసీపీ కూడా ఒత్తిడి పెంచేసింది. అందుకనే ఇఫుడు పిటీషన్ వ్యవహారం క్లైమ్యాక్సికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.
రఘురామరాజుపై వేటు వేయడం లేదన్న ఒత్తిడిలో ఇటీవలే విజయసాయిరెడ్డి ఏకంగా స్పీకర్ పై విమర్శలు చేశారు. గతంలో పొరపాటున రాజ్యసభలో నోరు జారి తరువాత నాలిక్కరుచుకుని సారీ చెప్పి విజయసాయి విమర్శలు ఆశ్చర్యకరం. దీనిపై తాజాగా రఘురామరాజు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి సంచలనం సృస్టించారు. చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on July 14, 2021 9:44 pm
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…