Political News

స్పీకర్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

ఎలాగైనా తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నాయకత్వం పట్టు. ఇదే సమయంలో తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకోవాలని తిరుగుబాటు ఎంపి ప్రయత్నాలు. రెండువైపుల ఒకేసారి జరుగుతున్న ప్రయత్నాలకు తొందరలోనే ముగింపు పడే అవకాశం ఉందని అనిపిస్తోంది. రెండు వైపుల నుండి జరుగుతున్న పరిణామాలు కూడా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై బాగా ఒత్తిడిని పెంచేస్తోంది.

తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అనర్హత వేటు విషయంలో రాబోయే సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అర్ధమైపోతోంది. అనర్హత వేటు విషయంలో తాను నిబంధనలను ప్రకారమే నడుచుకుంటానని స్పష్టంచేశారు. రెండు పార్టీలతోను భేటీ అయి వాళ్ళ వాదనలు వింటానని స్పీకర్ చెప్పటం చూస్తుంటే ఆ భేటీ ఏదో తొందరలోనే జరిగేట్లే ఉంది.

నిజానికి ఓ సభ్యుడిపై అనర్హత వేటు అన్నది విప్ జారీని ఉల్లంఘించినపుడు మాత్రమే తీసుకుంటారా ? లేకపోతే పార్టీ నియమావళిని ఉల్లంఘించినపుడు కూడా అనర్హత వేటు వేయచ్చా ? అనేది అయోమయంగా మారింది. తిరుగుబాటు ఎంపి విప్ ఉల్లంఘించినట్లు ఎక్కడా కనబడటంలేదు.

అయితే పార్టీ నియమావళిని ఉల్లంఘించారనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ పాయింట్ లోనే పార్టీ నాయకత్వం రఘురామపై అనర్హత వేటుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అనర్హత వేటు విషయంలో వైసీపీకి ఉన్న తొందర స్పీకర్ కు ఎందుకుంటుంది ? అందుకనే ఏదో కారణం చెప్పి విషయాన్ని స్పీకర్ బాగా సా…..గదీస్తున్నారు. అందుకనే వైసీపీ కూడా ఒత్తిడి పెంచేసింది. అందుకనే ఇఫుడు పిటీషన్ వ్యవహారం క్లైమ్యాక్సికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.

రఘురామరాజుపై వేటు వేయడం లేదన్న ఒత్తిడిలో ఇటీవలే విజయసాయిరెడ్డి ఏకంగా స్పీకర్ పై విమర్శలు చేశారు. గతంలో పొరపాటున రాజ్యసభలో నోరు జారి తరువాత నాలిక్కరుచుకుని సారీ చెప్పి విజయసాయి విమర్శలు ఆశ్చర్యకరం. దీనిపై తాజాగా రఘురామరాజు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి సంచలనం సృస్టించారు. చూడాలి ఏం జరుగుతుందో.

This post was last modified on July 14, 2021 9:44 pm

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

31 minutes ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

2 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

3 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

4 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

11 hours ago