Political News

రోజాకు వైసీపీలో సెగ మామూలుగా లేదే ?

చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే, జ‌బ‌ర్దస్త్ రోజాకు బాగానే సెగ త‌గులుతోంది. పైకి బాగానే యాక్టివ్‌గా ఉన్న‌ట్టు క‌నిపించినా.. ఆమె దూకుడు కార‌ణంగా.. పార్టీలో కీల‌క నేత‌ల నుంచి మంత్రుల వ‌ర‌కు.. క్షేత్ర‌స్థాయిలో రోజాపై సెగ‌లు క‌క్కుతున్నారు. “ఆమె ఎవ‌రినీ లెక్క‌చేయ‌దు. నియోజ‌క‌వ‌ర్గం అంటే.. జ‌బ‌ర్ద‌స్త్ కాంపౌండ్ లా ఫీల‌వుతోంది!” అని నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీనేత‌లే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న రోజాకు.. వాస్త‌వానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే.. ఈ పార్టీ నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చే విష‌యం ప‌క్క‌న పెడితే.. సొంత పార్టీలోనే రోజాకు పొగ‌పెడుతున్న వారు పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కేజే కుమార్‌, శాంతి దంప‌తులు .. వాస్త‌వానికి రోజా వ‌ర్గంగానే కొన్నాళ్ల వ‌ర‌కు కొన‌సాగారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లోనూ రోజా విజ‌యానికి వారు కృషి చేశారు. అయితే.. రోజా వీరిని ప‌క్క‌న పెట్టి.. (ఎందుకంటే.. వీరు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి వ‌ర్గంగా ఉండ‌డం) మ‌రో వ‌ర్గాన్ని చేర‌దీసింది. దీంతో కుమార్‌.. దంప‌తులు.. బ‌హిరంగంగానే రోజాపై విమ‌ర్శ‌లు చేశారు. తాము రోజా గెలుపు కోసం ప్ర‌య‌త్నించి ఎంతో కృషి చేశామ‌ని.. అయితే.. క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆరోపించారు. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా రోజా వ‌ర్సెస్ కుమార్ వ‌ర్గంగా ఇక్క‌డ రాజ‌కీయం సాగుతోంది. ఇక‌, పెద్దిరెడ్డితో రోజాకు ఉన్న విబేదాలు.. ఈ ఫ్యామిలీకి బాగా క‌లిసి వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల కుమార్ స‌తీమ‌ణి శాంతికి ఈడిగ కార్పొరేష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌గ్గాలు ఇప్పించ‌డం ద్వారా పెద్దిరెడ్డి గ‌ట్టి సంకేతాలు ఇచ్చిన‌ట్టయింది. దీంతో ఇప్పుడు ఈ వ‌ర్గం.. సొంత‌గా కార్య‌క్ర‌మాలు చేయ‌డంతోపాటు.. రోజాను కూడా లెక్క‌చేయ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌ర్గాలు ఏర్ప‌డి.. శాంతిని బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాను త‌ప్పించేందుకు, ఆ టికెట్‌ను త‌న స‌తీమ‌ణికి ఇప్పించుకునేందుకు కూడా కుమార్ ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో రోజాకు కంటిపై కునుకు లేకుండా పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో సొంత ఇల్లు క‌ట్టుకున్నారు. వారానికి రెండు రోజులు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్య‌టిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కుమార్ వ‌ర్గం పెరుగుతోందే త‌ప్ప‌.. రోజా వ‌ర్గంలో దూకుడు చూపించే నేత‌లు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. రోజా.. మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు వెళ్లిపోతే..ఇక్క‌డ పెత్త‌నం అంతా కుమార్ వ‌ర్గానికి ద‌క్కుతోంది. మొత్తానికి రోజాకు భారీ సెగ పెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 14, 2021 10:20 am

Share

Recent Posts

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

41 minutes ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

2 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

3 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

3 hours ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

4 hours ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

6 hours ago