సెంటిమెంటు ప్రాతిపదికగా నడుస్తున్న తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు.. షర్మిల.. మరింత సెంటిమెంటును రగిలించేందుకు ప్రయత్నించారు. తాజాగా ఆమె.. కన్నీరు పెట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు రాజన్న పేరుతో సెంటిమెంటును రగిలించేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతోనే ఇప్పుడు కన్నీటి రాజకీయాలకు షర్మిల తెరదీసిందని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు.
నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులు.. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. కుమారుని మృతితో గుండెలవిసేలా రోదిస్తున్న వారిని షర్మిల ఓదార్చారు. ఈ క్రమంలోనే షర్మిల కంటతడి పెట్టారు. అనంతరం కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 50వేల ఉద్యోగాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు.
నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. తాడిపర్తిలో రోజంతా నిరాహార దీక్ష చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే.. షర్మిల కన్నీళ్లు.. కేవలం రాజకీయం కోసమేనని.. ఏపీలో పరిస్థితి కూడా ఇలానే ఉందని, అక్కడ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే.. ప్రభుత్వం అరెస్టు చేయించి.. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్న వైనం.. షర్మిలకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు. మరి దీనికి షర్మిల ఎలాంటి ఆన్సర్ ఇస్తారో.. చూడాలి.
This post was last modified on July 13, 2021 6:25 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…