ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణాలో ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేసైతే టీఆర్ఎస్ దే. సమీప భవిష్యత్తులో కూడా ఈ ప్లేసులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరలాంటపుడు ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఎందుకింతగా గోల చేసేస్తున్నారు ? ఎందుకంటే కేవలం సెకండ్ ప్లేస్ కోసమే అనేది అర్ధమైపోతోంది.
వచ్చే ఎన్నికలనాటికి కూడా టీఆర్ఎస్సే మొదటిస్ధానంలో ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే ప్రతిపక్షాల్లో అనైక్యతే. ప్రతిపక్షాలు ఎంత బలోపేతమైతే టీఆర్ఎస్ కు అంతమంచిదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కే అడ్వాంటేజ్ అని చెప్పటంలో సందేహంలేదు. అంతమాత్రాన అధికారపార్టీపై జనాల్లో వ్యతిరేకత లేదని అనుకునేందుకు లేదు.
కాకపోతే టీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకతను అడ్వాంటేజ్ తీసుకునేంత సీన్ ప్రతిపక్షాల్లో లేదు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు ఎంతగా చీలిపోతే అధికారపార్టీకి అంత అడ్వాంటేజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉన్న కాంగ్రెస్, బీజేపీ సరిపోదన్నట్లు కొత్తగా వైఎస్సార్టీపీ మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎంతగా బలపడితే ఓట్లలో అంత చీలికవస్తుంది.
అప్పుడు చీలిపోయే ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొస్తుందనేదానిపైనే సెకెండ్ ప్లేస్ ఎవరిదనేది తేలుతుంది. ఇప్పటికైతే రెండు అంశాలు వాస్తవం. మొదటిది టీఆర్ఎస్ పైన జనాల్లో వ్యతిరేకత ఉందిన్నది నిశ్చయం. అలాగే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేంత సీన్ ఏ పార్టీకి లేదన్నది అంతే నిజం. కాబట్టి ముందు ముందు ప్రతిపక్షాల్లో ఏది ఎంత బలపడుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 13, 2021 11:13 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…