Political News

సెకెండ్ ప్లేస్ కోసమేనా ఈ గోలంతా ?

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణాలో ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేసైతే టీఆర్ఎస్ దే. సమీప భవిష్యత్తులో కూడా ఈ ప్లేసులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరలాంటపుడు ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఎందుకింతగా గోల చేసేస్తున్నారు ? ఎందుకంటే కేవలం సెకండ్ ప్లేస్ కోసమే అనేది అర్ధమైపోతోంది.

వచ్చే ఎన్నికలనాటికి కూడా టీఆర్ఎస్సే మొదటిస్ధానంలో ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే ప్రతిపక్షాల్లో అనైక్యతే. ప్రతిపక్షాలు ఎంత బలోపేతమైతే టీఆర్ఎస్ కు అంతమంచిదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కే అడ్వాంటేజ్ అని చెప్పటంలో సందేహంలేదు. అంతమాత్రాన అధికారపార్టీపై జనాల్లో వ్యతిరేకత లేదని అనుకునేందుకు లేదు.

కాకపోతే టీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకతను అడ్వాంటేజ్ తీసుకునేంత సీన్ ప్రతిపక్షాల్లో లేదు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు ఎంతగా చీలిపోతే అధికారపార్టీకి అంత అడ్వాంటేజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉన్న కాంగ్రెస్, బీజేపీ సరిపోదన్నట్లు కొత్తగా వైఎస్సార్టీపీ మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎంతగా బలపడితే ఓట్లలో అంత చీలికవస్తుంది.

అప్పుడు చీలిపోయే ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొస్తుందనేదానిపైనే సెకెండ్ ప్లేస్ ఎవరిదనేది తేలుతుంది. ఇప్పటికైతే రెండు అంశాలు వాస్తవం. మొదటిది టీఆర్ఎస్ పైన జనాల్లో వ్యతిరేకత ఉందిన్నది నిశ్చయం. అలాగే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేంత సీన్ ఏ పార్టీకి లేదన్నది అంతే నిజం. కాబట్టి ముందు ముందు ప్రతిపక్షాల్లో ఏది ఎంత బలపడుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 13, 2021 11:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

56 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago