వైసీపీలో ఇదే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత…. ఆయన లెక్కకు మిక్కిలిగా సలహాదారు పదవులు కేటాయించారు. తనకు ఎన్నికల సమయంలో సాయం చేసిన వారితోపాటు.. మీడియా పరం గా తన వాయిస్ను బలంగా వినిపించిన వారిని కూడా ఆయన అక్కున చేర్చుకుని సలహాదారు పదవులకు ప్రమోట్ చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఒకరిద్దరు సలహాదారులు మాత్ర తమ విధులకు దూరంగా.. రాజకీయాలు చేయడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు ఏకంగా.. సాక్షాత్తూ.. అప్రకటిత ఎమ్మెల్యేలుగా, ఎంపీలు గా వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీలో ఒక కీలక సీనియర్ పాత్రికేయుడు.. వైసీపీ సలహాదారుగా ఉన్నారు. అయితే.. ఆయన ఢిల్లీలో వైసీపీ వాయిస్ వినిపిస్తు న్నాయి. సీఎం జగన్ ఢిల్లీ టూర్లో ఆయనదే కీలక పాత్ర. అదే సమయంలో రాజకీయ వర్గాల్లోనూ వైసీపీకి.. మంచి మార్కులు పడేలా.. జాతీయ మీడియాతో ఆయన వ్యవహరిస్తున్న తీరు.. విమర్శలకు తావిస్తోంది.
ఇక, ఇక్కడే ఉన్న మరో కీలక సలహా దారు కూడా రాజకీయాలు మాట్లాడుతూ.. నిత్యం మీడియాలో ఉంటున్నారు. ఈ పరిణామాలతో.. వీరు హైలెట్ అవుతున్నారు. అయితే.. ఇవన్నీ ఇలా.. ఉంటే.. తాజాగా సలహాదారుల నియామకం, వారికి ఇస్తున్న జీతాలు.. వారి విధులపై హైకోర్టు త్వరలోనే సమీక్ష చేయనుంది.
సలహాదారులు.. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పని మానేసి.. రాజకీయంగా హైలెట్ కావడంపై హై కోర్టు సీరియస్ అయింది. ఈ క్రమంలోనే సలహాదారుల లెక్కలు తేలుస్తామని కూడా వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పటి వరకు లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటూ.. సలహాదారులుగా ఉన్న ఈ ఇద్దరి విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని.. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న సలహాదారును ఎమ్మెల్సీగా పంపి.. రాజకీయంగా చక్రం తిప్పేలా వ్యవహరిస్తారని.. అంటున్నారు.
అదే సమయంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న సలహాదారు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తారని.. ఈ ఇద్దరినీ ఎట్టి పరిస్థితిలోనూ.. వదులుకునేది లేదని జగన్ గురించి తెలిసిన వారు గట్టిగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 20, 2021 8:45 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…