బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జనాల చెవిలో పువ్వులు పెడుతున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి ప్రైవేటుపరం కాదని బల్లగుద్ది చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర బీజేపీ అడ్డుకుంటుందని వీర్రాజు గట్టిగా చెప్పారు. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసే విషయంలో వీర్రాజు తన పరిధిని దాటే మాట్లాడేశారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసే విషయంతో అసలు వీర్రాజుకు సంబంధమే లేదు, అడ్డకునేంత సీన్ ఆయనకు లేదు.
ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు రాష్ట్రానికే సంబంధంలేదు. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రప్రభుత్వ సంస్ధ. ఫ్యాక్టరీని కేంద్రం పరిధిలోనే కంటిన్యు చేస్తుందా లేకపోతే ప్రైవేటుపరం చేస్తుందా అన్నది పూర్తిగా కేంద్ర నిర్ణయం మీద ఆధారపడుంటుంది. అందుకనే ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేయాలని ఇఫ్పటికే కేంద్రం డిసైడ్ చేసేసింది.
ప్రైవేటుపరం చేసే విషయంలో ఇప్పటికే కేంద్రం అనేక చర్యలు తీసుకున్నది. దక్షిణకొరియా సంస్ధ పోస్కో యాజమాన్యంతో అనేకసార్లు చర్చలు జరిపింది. సంస్ధ యాజమాన్యం ఇప్పటికే రెండు మూడుసార్లు వైజాగ్ వచ్చి ఫ్యాక్టరీ మొత్తాన్ని చూసుకువెళ్ళింది. ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయటానికి వీలుగా న్యాయసలహాలు ఇవ్వటానికి, మార్గదర్శనం చేయటానికి వీలుగా న్యాయసలహదారు నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.
ఇదంతా ఒకఎత్తైతే ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటుపరం చేయబోతున్నట్లు స్వయంగా ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు. ఉక్కుశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ కూడా ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టంగా ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. కళ్ళముందే ఇంత జరుగుతున్నా వైజాగ్ స్టీల్స్ ప్రైవేటుపరం కాదంటు వీర్రాజు చెప్పటం జనాల చెవిలో పువ్వులు పెట్టడం తప్ప మరోటికాదు.
This post was last modified on July 12, 2021 10:56 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…