కొద్ది రోజులుగా తెలుగురాష్ట్రాల మధ్య జల జగడాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులపై మరో రాష్ట్రం ఫిర్యాదు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణపై తెలంగాణా ప్రభుత్వం కేంద్రానికి, సీడబ్ల్యూసీతో పాటు కృష్ణా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)లకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా తెలంగాణాలోని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఏపి కూడా నరేంద్రమోడి, జలవనరుల శాఖతో పాటు అనేక సంస్ధలకు ఫిర్యాదులు చేసింది.
తాజాగా తెలంగాణా ప్రభుత్వం 24 అక్రమ ప్రాజెక్టులను నిర్మాణానికి పూనుకుందని ఏపి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కేంద్రానికి ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు 15 ఉన్నాయట. మిగిలిన తొమ్మిది చిన్నతరహా ప్రాజెక్టులను చెప్పింది. మొత్తం 24 ప్రాజెక్టుల ద్వారా సుమారు 34 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీందించేలా తెలంగాణా ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు.
తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గవి పాలమూరు-రంగారెడ్డి, దిండి, భక్తరమదాసు, మిషన్ భగీరథ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్ధ్యంపెంపు, బీమా వరదకాలువ, పులిచింతల ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఈ ప్రాజెక్టులన్నింటినీ తెలంగాణా ప్రభుత్వం విభజన చట్టాన్ని తుంగలో తొక్కి మరీ నిర్మిస్తోందని ఏపి ఫిర్యాదు చేసింది.
అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇఫ్పటికే ఆరు ప్రాజెక్టులు పూర్తయిపోయి ఆయకట్టుకు నీరందిస్తోందట. అలాగే మరో రెండు ప్రాజెక్టుల పనులు చాలా స్పీడుగా జరుగుతోందట. మరో ఏడు ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వే పనులు జోరుగా జరుగుతున్నాయి. మిగిలిన తొమ్మిది ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వే చేయటానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందిని ఇరిగేషన్ ఉన్నతాధికారులు తమ ఫిర్యాదులో స్పష్టంగా చెప్పారు.
This post was last modified on July 7, 2021 10:51 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…