వైసీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పై ఐటీ అధికారుల కన్ను పడింది. ఆయనకు చెందిన ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.
హైదరాబాద్లోని ఐటీ విభాగానికి చెందిన దాదాపు 15 మంది అధికారులు అయోధ్య రామిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని రాంకీ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు గ్రూప్ అనుబంధ సంస్ధల కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల బృందం సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ మూల స్తంభాల్లో ఒకరైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతున్నాయి. రాంకీ గ్రూప్ అధినేతగా ఉన్న అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికైన ఎంపీల్లో అత్యధిక ధనవంతుల జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నారు.
ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న రాంకీ గ్రూప్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ తో పాటు పలు రంగాల్లో చురుగ్గా పనిచేస్తోంది. దీంతో ఆయన లావాదేవీలపై ఐటీ కన్ను పడినట్లు తెలుస్తోంది. రాంకీ గ్రూప్ అధినేతగా ఉంటూనే జగన్ కు సస్నిహితుడిగా పేరు తెచ్చుకున్న అయోధ్య రామిరెడ్డి గతేడాది రాజ్యసభ ఎంపీగా ఏపీ కోటాలో ఎన్నికయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయోధ్య రామిరెడ్డి స్వయానా సోదరుడు కావడం గమనార్హం.
This post was last modified on July 7, 2021 7:26 am
బహుముఖ ప్రజ్ఞాశాలి అడివి శేష్ నుంచి ఒక సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో దానిపై మంచి అంచనాలుంటాయి. ఈ వేసవిలో ‘డెకాయిట్’…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణా అధికార కాంగ్రెస్లో పరిస్థితి నూటెనిమిది డిగ్రీల సెల్సియస్ దాటింది. కొండా సురేఖ…
మంచి సినిమా తీశాం అన్న ధీమా కావచ్చు. లేదంటే సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్ కావచ్చు. ఈ…
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న…
‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…
విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…