Political News

టీఆర్ఎస్ హయాంలో బాబు కు మించిన ఫలితాలు

హైద‌రాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి అంటే త‌న పుణ్య‌మేన‌ని ప్ర‌క‌టించుకునే చంద్ర‌బాబు అవాక్క‌య్యేలా దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రంగం ఎగుమ‌తులు సాధించింది. పైగా ఈ ఫ‌లితాలు చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఉన్న స‌మ‌యంలోనే వెలువ‌డటం గ‌మ‌నార్హం. గ‌త ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. చివరి త్రైమాసికంలో ప్రపంచ ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగించింది.

ఈ ఏడాది జనవరి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జాతీయస్థాయిలో నమోదైన వృద్ధిరేటు కంటే ఇది రెట్టింపుకన్నా అధికం కావడం విశేషం.

జాతీయ సగటు 8.09 శాతం, ఇతర రాష్ట్రాల సగటు 6.92 శాతం ఉండగా, తెలంగాణ రికార్డు స్థాయిలో 17.93 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా దేశీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది.

కాగా, హైద‌రాబాద్‌లో ఐటీ అభివృద్ధి ప్ర‌దాత‌గా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించుకున్నారు. ఓ ద‌శ‌లో రాష్ట్రం విడిపోతే ఐటీ అభివృద్ధి సైతం ఆగిపోతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధి‌కారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అదే రీతిలో ఐటీ ఊపు కొన‌సాగింది.

అంతేకాకుండా ఐటీ రంగం మునుపెన్న‌డూ లేనంత వృద్ధి చెందుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌డం, కాక‌తాళీయంగా ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు హైదరాబాదులో ఉండ‌టం గ‌మ‌నార్హం.

This post was last modified on May 22, 2020 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

49 minutes ago

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

2 hours ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

3 hours ago

విశాఖ‌కు మ‌హ‌ర్ద‌శ‌.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు!

ప్ర‌స్తుతం ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌ప‌ట్నానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. తాజాగా విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని…

7 hours ago

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…

10 hours ago

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…

10 hours ago