హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి అంటే తన పుణ్యమేనని ప్రకటించుకునే చంద్రబాబు అవాక్కయ్యేలా దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రంగం ఎగుమతులు సాధించింది. పైగా ఈ ఫలితాలు చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న సమయంలోనే వెలువడటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. చివరి త్రైమాసికంలో ప్రపంచ ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగించింది.
ఈ ఏడాది జనవరి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జాతీయస్థాయిలో నమోదైన వృద్ధిరేటు కంటే ఇది రెట్టింపుకన్నా అధికం కావడం విశేషం.
జాతీయ సగటు 8.09 శాతం, ఇతర రాష్ట్రాల సగటు 6.92 శాతం ఉండగా, తెలంగాణ రికార్డు స్థాయిలో 17.93 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా దేశీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది.
కాగా, హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి ప్రదాతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వివిధ సందర్భాల్లో ప్రకటించుకున్నారు. ఓ దశలో రాష్ట్రం విడిపోతే ఐటీ అభివృద్ధి సైతం ఆగిపోతుందని ప్రచారం జరిగింది. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రీతిలో ఐటీ ఊపు కొనసాగింది.
అంతేకాకుండా ఐటీ రంగం మునుపెన్నడూ లేనంత వృద్ధి చెందుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఈ ఫలితాలను విడుదల చేయడం, కాకతాళీయంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాదులో ఉండటం గమనార్హం.
This post was last modified on May 22, 2020 12:28 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…