హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి అంటే తన పుణ్యమేనని ప్రకటించుకునే చంద్రబాబు అవాక్కయ్యేలా దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రంగం ఎగుమతులు సాధించింది. పైగా ఈ ఫలితాలు చంద్రబాబు హైదరాబాద్లో ఉన్న సమయంలోనే వెలువడటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. చివరి త్రైమాసికంలో ప్రపంచ ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగించింది.
ఈ ఏడాది జనవరి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జాతీయస్థాయిలో నమోదైన వృద్ధిరేటు కంటే ఇది రెట్టింపుకన్నా అధికం కావడం విశేషం.
జాతీయ సగటు 8.09 శాతం, ఇతర రాష్ట్రాల సగటు 6.92 శాతం ఉండగా, తెలంగాణ రికార్డు స్థాయిలో 17.93 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా దేశీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతానికి చేరుకొని ఐటీలోనే మేటిగా నిలిచింది.
కాగా, హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి ప్రదాతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వివిధ సందర్భాల్లో ప్రకటించుకున్నారు. ఓ దశలో రాష్ట్రం విడిపోతే ఐటీ అభివృద్ధి సైతం ఆగిపోతుందని ప్రచారం జరిగింది. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రీతిలో ఐటీ ఊపు కొనసాగింది.
అంతేకాకుండా ఐటీ రంగం మునుపెన్నడూ లేనంత వృద్ధి చెందుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఈ ఫలితాలను విడుదల చేయడం, కాకతాళీయంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాదులో ఉండటం గమనార్హం.
This post was last modified on May 22, 2020 12:28 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…