Political News

‘అమ్మ’ ఆస్తి ఇక.. తమిళనాడు ప్రభుత్వానిదే

వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వస్తాం.. పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకెళ్లమన్న భావన ప్రతిఒక్కరిలో కలిగేలా చేయటంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

తిరుగులేని నేతగా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం..అపోలో ఆసుపత్రిలో చేరటం తెలిసిందే. అర్థరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రికి వెళ్లిన ఆమె.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన తర్వాత మాత్రమే ఆమెను చూసే అవకాశం ప్రజలకు లభించింది.

అపోలో ఆసుపత్రిలో సుదీర్ఘకాలం సాగిన ఆమె ట్రీట్ మెంట్ మీద సందేహాలు.. ఆరోపణల గురించి తెలిసిందే. అమ్మకు అత్యంత ప్రాణపదమైన పోయెస్ గార్డెన్ ను మ్యూజియంగా మార్చాలని కొంతకాలం డిమాండ్లు వినిపించాయి.

తాజాగా.. ఆ భవనాన్ని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఆర్డినెన్స్ ను జారీ చేయటం ఆసక్తికరం మారింది. పోయెస్ గార్డెన్ ను సొంతం చేసుకోవటానికి చట్టపరమైన వారసుల మధ్య పరిష్కారం కుదరని నేపథ్యంలో.. దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్స్ జారీ అయ్యింది.

ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుకు తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోమిత్ ఓకే చెప్పేశారు. పోయెస్ గార్డెన్ నిర్వహణను సీఎం నేతృత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి.. సమాచారా శాఖ మంత్రి.. సమాచార శాఖ కార్యదర్శి ధర్మకర్తలుగా ట్రస్టును ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్డినెన్సు ను జారీ చేశారు.

జీవితంలో కష్టపడి సంపాదించిన దానితో కట్టుకున్న భవనం.. అయిన వారికి కాకుండా.. ప్రభుత్వ పరమవుతుందని.. ఇలా ఒక ఆర్డినెన్స్ జారీ అవుతుందని ‘అమ్మ’ ఏ రోజు అనుకొని ఉండరేమో?

This post was last modified on May 22, 2020 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago