ప్రధాని నరేంద్ర మోడీ.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరెవరికి పదవులు దక్కుతాయనే విషయంపై ఆసక్తి నెలకొన్న విషయాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయం హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కేవలం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఒక్కరే మోడీ కేబినెట్లో ఉన్నారు. ఏపీ నుంచి ఎవరూ గత ఎన్నికల్లో విజయం దక్కించుకోని నేపథ్యంలో మోడీ ఏపీని పట్టించుకోలేదు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఇప్పటికే మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తారని .. బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ కిషన్ రెడ్డి దూకుడుగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. దీనికన్నా.. ఆయనకు స్వతంత్ర హోదా ఉన్న మంత్రి పదవిని కట్టబెట్టి.. మరింతగా ఆయనకు ప్రాధాన్యం ఇస్తే.. పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు ప్రమోషన్ ఇస్తారని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణకు కేంద్రంలో గుర్తింపు ఇచ్చారనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
మరోవైపు ఏపీ లోనూ బీజేపీ పాగా వేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికిప్పుడు ఎవరూ ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపీ లేకపోయినా.. రాజ్యసభ సభ్యుడు.. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ చురుగ్గా ఉన్న జీవీఎల్ నరసింహారావుకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని.. బీజేపీ నేతల మధ్య గుసగుస వినిపిస్తోంది. ఒకటి గట్టి వాయిస్ వినిపించే నేతకు గుర్తింపు లభించిందనే సంకేతాలు పంపించడం.. రెండు.. సీఎం జగన్ కు జీవీఎల్ అనుకూల నాయకుడు.. అనే ప్రచారం ఉండడం వంటివి పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల నాటికి జగన్తో కలిసి పనిచేయడమా? లేక.. జగన్కు సహకరించడమో.. చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జీవీఎల్కు అవకాశం ఇస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 6, 2021 10:51 am
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…