ప్రధాని నరేంద్ర మోడీ.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరెవరికి పదవులు దక్కుతాయనే విషయంపై ఆసక్తి నెలకొన్న విషయాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయం హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కేవలం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఒక్కరే మోడీ కేబినెట్లో ఉన్నారు. ఏపీ నుంచి ఎవరూ గత ఎన్నికల్లో విజయం దక్కించుకోని నేపథ్యంలో మోడీ ఏపీని పట్టించుకోలేదు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఇప్పటికే మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తారని .. బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ కిషన్ రెడ్డి దూకుడుగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. దీనికన్నా.. ఆయనకు స్వతంత్ర హోదా ఉన్న మంత్రి పదవిని కట్టబెట్టి.. మరింతగా ఆయనకు ప్రాధాన్యం ఇస్తే.. పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు ప్రమోషన్ ఇస్తారని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణకు కేంద్రంలో గుర్తింపు ఇచ్చారనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
మరోవైపు ఏపీ లోనూ బీజేపీ పాగా వేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికిప్పుడు ఎవరూ ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపీ లేకపోయినా.. రాజ్యసభ సభ్యుడు.. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ చురుగ్గా ఉన్న జీవీఎల్ నరసింహారావుకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని.. బీజేపీ నేతల మధ్య గుసగుస వినిపిస్తోంది. ఒకటి గట్టి వాయిస్ వినిపించే నేతకు గుర్తింపు లభించిందనే సంకేతాలు పంపించడం.. రెండు.. సీఎం జగన్ కు జీవీఎల్ అనుకూల నాయకుడు.. అనే ప్రచారం ఉండడం వంటివి పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల నాటికి జగన్తో కలిసి పనిచేయడమా? లేక.. జగన్కు సహకరించడమో.. చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జీవీఎల్కు అవకాశం ఇస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…