సోషల్ మీడియాలో ఓ సర్వే వైరలవుతోంది. అదేమిటంటే పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల తాను పెట్టబోయే పార్టీ విషయమై జనస్పందన తెలుసుకునేందుకు సర్వే చేయించారట. మొత్తం 33 జిల్లాలో జరిగిన సర్వే ప్రకారం మంచి సానుకూల రిపోర్టు వచ్చిందట. చెన్నైకి చెందిన నేషనల్ పొలిటికల్ కన్సెల్టెన్సీ (ఎన్పీసీ) ద్వారా సర్వే చేయించుకున్నారట.
ఈ సర్వేలోని ముఖ్యమైన అంశాలేమిటి ? ఏమిటంటే తెలంగాణా వ్యాప్తంగా దివంగత వైఎస్సార్ పై జనాల్లో అభిమానం ఎలాగుంది ? అప్పట్లో వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి ? పార్టీ పెడితే షర్మిలను ఆధరిస్తారా ? కేసీయార్ పాలన ఎలాగుంది ? జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎంఎల్ఏలపై జనాభిప్రాయం ఏమిటి ? రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎలాంటి అభ్యర్ధులను జనాలు కోరుకుంటున్నారు ? లాంటి అంశాలపై సర్వే జరిగిందట.
సర్వే ప్రకారం వైస్ పై 72 నియోజకవర్గాల్లోని జనాల్లో సానుకూల స్పందన కనబడిందట. ఖమ్మం, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో కూడా వైఎస్ పై జనాల్లో అభిమానం చెక్కు చెదరలేదని సర్వేలో తేలిందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉన్న 119 నియోజకవర్గాల్లో 72 నియోజకవర్గాల్లో వైఎస్ పై జనాల్లోని అభిమానం చెక్కు చెదరలేదంటే మామూలు విషయంకాదు. సర్వే ఫలితం గనుక నిజమే అయితే కేసీయార్ కు డేంజర్ బెల్స్ ఖాయమనే చెప్పాలి.
This post was last modified on July 7, 2021 7:28 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…