రెండు నెలలుగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు లేక సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలతో పాటు ఉన్నత వర్గాల వాళ్లందరూ ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వలస కూలీలు, సామాన్యుల కోసం రైళ్లు, బస్సులు పున:ప్రారంభించారు కానీ.. ప్రయాణాల కోసం విమానాల్నే ఆశ్రయించే వారు మాత్రం తమకెప్పుడు వెసులుబాటు లభిస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఐతే వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం అంతర్జాతీయ ప్రత్యేక విమానాలు నడిపిన ప్రభుత్వం.. రోజు వారీ సర్వీసుల్ని ఈ నెల 25న మొదలుపెట్టాలని నిర్ణయించింది. భౌతిక దూరం, మాస్కులు, గ్లౌజులు సహా అనేక విషయాల్లో కట్టుదిట్టమైన నిబంధనల మధ్య ఈ ప్రయాణాలు సాగనున్నాయి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే విడుదలయ్యాయి. దీంతో పాటు టికెట్ల రేట్ల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించింది.
విమాన యాన సంస్థలు ఈ సమయంలో డిమాండును బట్టి ఇష్టానుసారం రేట్లు పెట్టి ప్రయాణికుల్ని దోచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వే రేట్ల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రయాణ సమయాన్ని బట్టి దేశీయ ప్రయాణాల్ని ఆరు సెక్టార్లుగా విభజించారు.
40 నిమిషాల లోపు ప్రయాణ సమయంలో ఉన్న ‘ఎ’ సెక్టార్లో ఛార్జీ కనీసం రూ.2 వేల నుంచి గరిష్టగా రూ.6 వేలు పెట్టుకోవచ్చు. 40-60 నిమిషాల మధ్య ప్రయాణ సమయం ఉంటే.. రూ.2500-7500 మధ్య, 60-90 నిమిషాల మధ్య అయితే రూ.3000-9000 మధ్య 90-120 నిమిషాల మధ్య అయితే రూ.3500-10000 మధ్య, 120-150 నిమషాల మధ్య అయితే రూ.4500-13000 మధ్య, 150-180 నిమిషాల మధ్య అయితే రూ.5500-15700 మధ్య, 180-200 నిమిషాల మధ్య అయితే రూ.6500-రూ.18600 మధ్య ఛార్జీలు ఉండాలని ప్రభుత్వం షరతులు విధించింది. అంటే కనిష్టంగా రూ.2 వేలతో మొదలై.. గరిష్టంగా రూ.18600కు మించకుండా దేశీయ విమాన ఛార్జీలు ఉండబోతున్నాయన్నమాట.
This post was last modified on May 22, 2020 10:37 am
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…