Political News

సినిమా హాళ్ల‌కు ఓకే.. జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో విధించిన క‌ర్ఫ్యూను ఏపీ ప్ర‌భుత్వం దాదాపు ఎత్తేసింది! క‌రోనా సెకండ్ వేవ్‌తో కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మే 1వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. అయితే.. కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో క‌ర్ఫ్యూను విడ‌త‌ల వారీగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌గ్గిస్తూ వ‌స్తోంది. ఆదిలో ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు మాత్ర‌మే.. సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి అనుమ‌తులు ఇచ్చిన ప్ర‌భుత్వం.. ప్ర‌తి వారానికి దీనిని త‌గ్గిస్తూ.. వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు క‌ర్ఫ్యూను స‌డ‌లించిన ప్ర‌భుత్వం తాజాగా దాదాపు క‌ర్ఫ్యూను ఎత్తేసేలా నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా పాజిటివిటీ 5 శాతం త‌క్కువ‌గా ఉన్న 11 జిల్లాల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయిలో వెసులుబాటు క‌ల్పించింది. అదేస‌మ‌యంలో మ‌రిన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రిజిల్లాల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపు ఇచ్చిన ప్ర‌భుత్వం మిగిలిన జిల్లాల్లో మాత్రం రాత్రి 10 వ‌ర‌కు సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి అవ‌కాశం ఇచ్చింది.

అదేస‌మ‌యంలో 11 జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయాల‌ని ఆదేశించిన ప్ర‌భుత్వం రాత్రి 10 త‌ర్వాత క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని పేర్కొంది. ఇక‌, అన్ని జిల్లాల్లోనూ సినిమా హాళ్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాత్రం సూచించింది. అదేవిధంగా 50 శాతం సామ‌ర్థ్యంతో రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాల‌ను తిరిగి తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమతి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే.. జ‌గ‌న్ నిర్ణ‌యంపై వైద్య రంగ నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో రెండు వారాల పాటు.. క‌ర్ఫ్యూను కొన‌సాగించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.

This post was last modified on July 5, 2021 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

41 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago