కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం దాదాపు ఎత్తేసింది! కరోనా సెకండ్ వేవ్తో కేసులు, మరణాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మే 1వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే.. కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కర్ఫ్యూను విడతల వారీగా జగన్ ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. ఆదిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే.. సాధారణ జనజీవనానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. ప్రతి వారానికి దీనిని తగ్గిస్తూ.. వచ్చింది.
ఈ క్రమంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు కర్ఫ్యూను సడలించిన ప్రభుత్వం తాజాగా దాదాపు కర్ఫ్యూను ఎత్తేసేలా నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివిటీ 5 శాతం తక్కువగా ఉన్న 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పూర్తిస్థాయిలో వెసులుబాటు కల్పించింది. అదేసమయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరిజిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన జిల్లాల్లో మాత్రం రాత్రి 10 వరకు సాధారణ జనజీవనానికి అవకాశం ఇచ్చింది.
అదేసమయంలో 11 జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయాలని ఆదేశించిన ప్రభుత్వం రాత్రి 10 తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇక, అన్ని జిల్లాల్లోనూ సినిమా హాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రం సూచించింది. అదేవిధంగా 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, జిమ్లు, కల్యాణ మండపాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే.. జగన్ నిర్ణయంపై వైద్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వారాల పాటు.. కర్ఫ్యూను కొనసాగించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
This post was last modified on July 5, 2021 2:10 pm
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…
రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…