కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం దాదాపు ఎత్తేసింది! కరోనా సెకండ్ వేవ్తో కేసులు, మరణాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మే 1వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే.. కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కర్ఫ్యూను విడతల వారీగా జగన్ ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. ఆదిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే.. సాధారణ జనజీవనానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. ప్రతి వారానికి దీనిని తగ్గిస్తూ.. వచ్చింది.
ఈ క్రమంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు కర్ఫ్యూను సడలించిన ప్రభుత్వం తాజాగా దాదాపు కర్ఫ్యూను ఎత్తేసేలా నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివిటీ 5 శాతం తక్కువగా ఉన్న 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పూర్తిస్థాయిలో వెసులుబాటు కల్పించింది. అదేసమయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరిజిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన జిల్లాల్లో మాత్రం రాత్రి 10 వరకు సాధారణ జనజీవనానికి అవకాశం ఇచ్చింది.
అదేసమయంలో 11 జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయాలని ఆదేశించిన ప్రభుత్వం రాత్రి 10 తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇక, అన్ని జిల్లాల్లోనూ సినిమా హాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రం సూచించింది. అదేవిధంగా 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, జిమ్లు, కల్యాణ మండపాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే.. జగన్ నిర్ణయంపై వైద్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వారాల పాటు.. కర్ఫ్యూను కొనసాగించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…