తెలంగాణ బిడ్డ.. ఉత్తరప్రదేశ్ లో సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన శ్రీకళా రెడ్డి అనే మహిళ.. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు.
మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె ఈ శ్రీకళా రెడ్డి కావడం గమనార్హం. ఈమె గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న అనుభవం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ.. బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు వినిపించడం గమనార్హం.
కాగా.. కొంత కాలం క్రితం ఆమెకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ధనుంజయ్ తో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో.. ఆమె అక్కడ జరిగితన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పోటీల్లో ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. ఆ తర్వత జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గానూ ఎన్నికయ్యారు. కాగా.. ఈ వార్త ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటోంది. మా ఇంటి బిడ్డ.. పక్క రాష్ట్రంలో సత్తా చాటిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 5, 2021 12:56 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…