తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆయన ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గం. ఈటల రాజీనామ ఆమోదం పొందిన నేపథ్యంలో త్వరలోనే ఎన్నికలు జరగనుండటం ఖాయమైపోయింది. ఈ ఎన్నిక సహజంగానే ఇటు ఈటలకు అటు సీఎం కేసీఆర్కు ప్రతిష్టాత్మకం. గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనని గులాబీ నేతలు ధీమ వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం లెక్కల్లో తేడా రాకుండా జాగ్రత్త పడుతన్నట్లు చెప్తున్నారు. ఒకరకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఎన్నిక విషయంలో ఎక్కువ జాగ్రత్తే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఎన్నిక విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసకుంటున్నారనేందుకు తాజాగా చోటు చేసుకున్న రెండు పరిణామాలే ఉదాహరణ అంటున్నారు. దీర్ఘకాలంగా పెండిగ్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నికల హామీ అయిన 57 ఏళ్ల వయసు వారికి పెన్షన్ అనే మాటను తాజాగా కేసీఆర్ నిలుపుకొన్నారు. తన కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల టూరులో ఈ మేరకు కేసీఆర్ ప్రకటన చేసేశారు. తద్వారా వృద్ధుల్లో ఆశలు రేకెత్తించేశారు.
ఇక తెలంగాణలో నిరాశగా ఉన్న మరో సెక్షన్ అయిన యువతను సైతం కూల్ చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల త్వరలోనే సాకారం అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ శాఖలో ఉన్న 19 వేల పైచిలుకు కానిస్టేబుల్ పోస్టులు.. 625 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి డీజీపీ ఆర్థిక శాఖకు నివేదిక పంపించారు . ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ కానుంది. తద్వారా యువత నిరీక్షణకు తెరపడనుంది. అయితే, ఈ కీలక అడుగుల వెనుక కారణం హుజురాబాద్ ఉప ఎన్నిక అంటూ కొందరు అంచనా వేస్తున్నారు.
This post was last modified on July 5, 2021 10:12 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…