ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… చెన్నై అపోలో అసుపత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
కాగా కత్తి మహేష్ వైద్య ఖర్చులకు ఏపి ప్రభుత్వం రూ.17లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ నుండి ఆసుపత్రి యాజమాన్యంకు సీఎంఆర్ఎఫ్ నుండి ఎల్ఓసీ జారీ చేసింది.
ఆరు రోజుల క్రితం కత్తి మహేష్ చిత్తూరు జిల్లా నుండి హైదరాబాద్ కు కారులో వెళుతుండగా నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ ను తొలుత నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలు కావడం, పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ఆయనను చెన్నైకి తరలించారు.
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం కత్తి మహేష్ చికిత్స పొందుతున్నారు. అక్కడ పలు శస్త్ర చికిత్సలు జరగడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ సీఎం సహాయ నిధి నుండి వైద్య ఖర్చులకు నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, మహేష్ స్నేహితులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
This post was last modified on July 2, 2021 4:50 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…