దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్.. కోవీషీల్డ్ లకు సంబంధించి కొన్ని దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇంతకాలం ఎంతలా చెప్పినా మాట వినని దేశాలకు.. తనదైన శైలిలో సమాధానం చెప్పటం షురూ చేసింది. కొవిడ్ 19కు చెక్ పెట్టే వ్యాక్సిన్లలో భారత్ లో రూపొందించిన సీరం వారి కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాల్ని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ టీకా కార్యక్రమం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ టీకాలు వేయించుకున్న వారు యూరోపియన్ దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. భారత్ కు చెందిన రెండు టీకాల్ని గుర్తించేందుకు ఈయూ ససేమిరా అంటోంది. దీనికి సంబంధించిన వివరాల్నిఇప్పటికే ఆయా దేశాలతో భారత్ చెప్పినా.. మాట వినని పరిస్థితి. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలకు అర్థమయ్యే మాటను భారత్ చెప్పటం షురూ చేసింది.
తమ టీకాలను యూరోపియన్ దేశాలు గుర్తించని పక్షంలో.. వారి దేశస్తులు భారత్ కు వస్తే వారిని తాము కూడా గుర్తించమని స్పష్టం చేసింది. యూరోపియన్ దేశాల గ్రీన్ పాస్ స్కీంలో భారత్ టీకాలకు చోటు కల్పించని పక్షంలో.. తాము కూడా ఈయూ దేశాలకు చెందిన వారు భారత్ కు వస్తే.. వారి వ్యాక్సిన్లను తాము గుర్తించమని స్పష్టం చేశారు. అదే జరిగితే.. ఆయా దేశాల వారు భారత్ కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తోంది. మరి.. ఇప్పటికైనా ఈయూ దేశాల తీరు మారుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 1, 2021 5:01 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…