Political News

మన టీకాలకు ఓకే చెప్పని ఈయూకి భారత్ వార్నింగ్

దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్.. కోవీషీల్డ్ లకు సంబంధించి కొన్ని దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇంతకాలం ఎంతలా చెప్పినా మాట వినని దేశాలకు.. తనదైన శైలిలో సమాధానం చెప్పటం షురూ చేసింది. కొవిడ్ 19కు చెక్ పెట్టే వ్యాక్సిన్లలో భారత్ లో రూపొందించిన సీరం వారి కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాల్ని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ టీకా కార్యక్రమం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ టీకాలు వేయించుకున్న వారు యూరోపియన్ దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. భారత్ కు చెందిన రెండు టీకాల్ని గుర్తించేందుకు ఈయూ ససేమిరా అంటోంది. దీనికి సంబంధించిన వివరాల్నిఇప్పటికే ఆయా దేశాలతో భారత్ చెప్పినా.. మాట వినని పరిస్థితి. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలకు అర్థమయ్యే మాటను భారత్ చెప్పటం షురూ చేసింది.

తమ టీకాలను యూరోపియన్ దేశాలు గుర్తించని పక్షంలో.. వారి దేశస్తులు భారత్ కు వస్తే వారిని తాము కూడా గుర్తించమని స్పష్టం చేసింది. యూరోపియన్ దేశాల గ్రీన్ పాస్ స్కీంలో భారత్ టీకాలకు చోటు కల్పించని పక్షంలో.. తాము కూడా ఈయూ దేశాలకు చెందిన వారు భారత్ కు వస్తే.. వారి వ్యాక్సిన్లను తాము గుర్తించమని స్పష్టం చేశారు. అదే జరిగితే.. ఆయా దేశాల వారు భారత్ కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తోంది. మరి.. ఇప్పటికైనా ఈయూ దేశాల తీరు మారుతుందో లేదో చూడాలి.

This post was last modified on July 1, 2021 5:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago